SSMB 29 : SSMB 29 : జక్కన్న.. నువ్వు మామూలోడివి కాదయ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరో అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. బాహుబలి, RRR వంటి ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన చిత్రాల తర్వాత, ఈసారి ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఓ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం రాజమౌళి ఇప్పటివరకు ఎన్నడూ చూడనంతగా భారీగా సెట్ను నిర్మిస్తున్నారు. తాజాగా వారణాసి ప్రేరణతో రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 50 కోట్ల ఖర్చుతో ఒక చారిత్రాత్మక నగరాన్ని తిరిగి రూపు దిద్దుతున్నారు. ప్రామాణికతకు ప్రాముఖ్యత ఇస్తూ, నదీ తీరాలు, ఘాట్లు, పురాతన దేవాలయాలు వంటి అన్ని వివరాలతో ఈ సెట్ను డిజైన్ చేస్తున్నారని సమాచారం.
Also Read : Rajasab : ‘రాజా సాబ్’ నుండి.. అదిరిపోయే అప్ డేట్ లీక్ చేసిన బ్యూటీ !
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
ఒరిజినల్ విజువల్స్ కోసం నిజమైన వారణాసిలో చిత్రీకరించాలని ఆలోచన ప్రారంభంలో ఉండగా, లాజిస్టికల్ సమస్యలు, అనుమతులు, జనసంచారం, భద్రత వంటి అంశాల నేపథ్యంలో ప్రత్యేకంగా సెట్ ఏర్పాటు చేయాలని రాజమౌళి నిర్ణయించారట. ఇంతవరకు బాలీవుడ్లో లగ్జరీ సెట్లకు పేరున్న సంజయ్ లీలా భన్సాలీ ‘దేవదాస్’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘హీరామండి’ వంటి చిత్రాలకు రూ. 15 నుంచి రూ. 50 కోట్ల దాకా ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. అయితే, రాజమౌళి ప్రాజెక్ట్ ఈ మొత్తం ఖర్చు మించిపోతూ భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవబోతోంది. ఇక ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనుండగా. ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు. మొత్తం ప్రాజెక్ట్కు అంచనా బడ్జెట్ ఏకంగా రూ. 1000 కోట్లు అన్నది ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
తాజావార్తలు
-
ED raids : హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్పై సోదాలు..?
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్వెజ్ వివాదానికి బీజేపీ తెర!
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?