Sai Pallavi Birthday Special: నర్తనమే సాయి పల్లవికి కవచం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనలో కళ ఉండాలే కానీ, కళకళలాడే ఓ రోజు వస్తుంది. ఈ సత్యాన్ని నమ్ముకొని నవతరం నాయిక సాయిపల్లవి చిత్రసీమలో అడుగు పెట్టింది. ఆమెకు ఉన్న కళ ఏమిటంటే – నాట్యం! సంగీత దర్శకుల బాణీలకు అనువుగా తన కాళ్ళతోనూ, చేతులతోనూ నర్తనం చేసి ఆకట్టుకోగల నైపుణ్యం సాయి పల్లవి సొంతం. నృత్యంలో అనుభవం ఉన్న కారణంగా ముఖంలో భావాలను ఇట్టే పలికించగలదు. అందువల్లే సాయిపల్లవి తన పాత్రల్లోకి అతి సులువుగా ఒదిగిపోతూ కనిపిస్తుంది.
సాయిపల్లవి 1992 మే 9న తమిళనాడు నీలగిరి జిల్లాలోని కోటగిరిలో జన్మిచింది. కొయంబత్తూర్ లోని అవిలా కాన్వెంట్ స్కూల్ లో సాయి పల్లవి విద్యాభ్యాసం సాగింది. సాయి పల్లవి ఎక్కడా నాట్యశిక్షణ తీసుకున్నది లేదు. చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ఎంతో ఇష్టం. తన చెవులకు సోకిన సంగీతానికి అనువుగా ఆమె అడుగులు కలిపేది. అదే చూపరులను ఎంతగానో ఆకట్టుకొనేది. ఆ పై సినిమా పాటలను చూస్తూ, వాటిలోని డాన్స్ ను అనుకరించింది. తరువాత అవే బాణీలకు తాను సొంతగా ఎలా డాన్స్ చేస్తానో చూపించేది. ఇలా ప్రాక్టీస్ చేస్తూనే ఓ వైపు తన చదువునూ కొనసాగించింది. జార్జియాలోని టిబిలిసి మెడికల్ యూనివర్సిటీలో డాక్టర్ కోర్సు చదివింది. ఈ యూనివర్సిటీకి మన దేశంలోని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది. 2016లోనే ఆమె డాక్టర్ పట్టా పొందాలి. అయితే డాన్స్, సినిమా కెరీర్ కారణంగా సరైన సమయంలో డాక్టర్ అనిపించుకోలేక పోయింది. అయితే 2020 ఆగస్టు 31న ట్రిచీలో ‘ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్’ రాసింది.
Also Read
- Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
- Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
- Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్కి తిరుగులేదు!".
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
2009లో ఈటీవీ నిర్వహించిన ‘ఢీ’ కార్యక్రమంలో తన డాన్సుల ద్వారా ఫైనలిస్ట్ గానూ నిలిచింది సాయిపల్లవి. ఇక నటన విషయానికి వస్తే, చిన్నతనం నుంచీ ఎంతో చురుగ్గా ఉన్న సాయిపల్లవిని 2005లో మళయాళం దర్శకుడు ఎ.కె.లోహిత్ దాస్ తాను దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కస్తూరి మాన్’లో నటింప చేశారు. 2008లో జయం రవి హీరోగా రూపొందిన ‘ధామ్ ధూమ్’లోనూ నటించింది సాయిపల్లవి. 2014లో మళయాళ చిత్రం ‘ప్రేమమ్’లో నాయికగా నటించి మురిపించిందామె. ఆ తరువాత నుంచీ చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తూ ముందుకు సాగింది. 2017లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టింది సాయిపల్లవి. ఆ సినిమాలో భానుమతి పాత్రలో భలేగా అలరించిందామె. అప్పటి నుంచీ సాయి పల్లవి తెలుగు చిత్రాల్లోనూ తన ప్రతిభను చాటుకుంది.
నాని హీరోగా రూపొందిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రంలో సాయి పల్లవి డాన్స్ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ పై “కణం, పడి పడి లేచె మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్” చిత్రాల్లోనూ సాయిపల్లవి తనదైన అభినయంతో ఆకట్టుకుంది. ఓ వైపు తమిళ, మళయాళ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు తనకు ఎంతో పేరు సంపాదించి పెట్టిన తెలుగు చిత్రసీమలోనూ సాయిపల్లవి సక్సెస్ రూటులో సాగిపోతోంది. ఆమె నటించిన అనువాద చిత్రాలు సైతం తెలుగువారిని అలరిస్తున్నాయి. రానాతో కలసి సాయిపల్లవి నటించిన ‘విరాటపర్వం’ చిత్రం జూలై 1న జనం ముందుకు రానుంది. ఇందులో ఆమె వెన్నెల అనే పాత్ర పోషించింది. మరి ఈ చిత్రంతో సాయి పల్లవి ఏ తీరున ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!