బాలీవుడ్ వివాదాస్పద నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) మరోసారి వార్తల్లో నిలిచారు. దివంగత నటుడు, తన మాజీ ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత ఎదుర్కొన్న లీగల్ కేసులు, అరెస్టులు, తీవ్రమైన సోషల్ మీడియా ట్రోలింగ్స్ నుండి కోలుకుని.. ఇప్పుడిప్పుడే కెరీర్పై ఫోకస్ పెడుతున్న రియా, సడన్గా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలం పాటు సోషల్ మీడియాకు పూర్తిగా బ్రేక్ ఇస్తున్నట్లు (Social Media Detox) ఆమె ప్రకటించారు.
‘ఈ మధ్య కాలంలో నన్ను నేను కాస్త మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది. సోషల్ మీడియాలోని నిరంతర శబ్దం, స్క్రోలింగ్, ఆన్లైన్ ప్రపంచంతో పోటీ పడటం.. ఇవన్నీ నేను ఊహించిన దానికంటే ఎక్కువ భారంగా (Overwhelming) అనిపిస్తున్నాయి. ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా గడపాలి. అందుకే కాస్త సోషల్ మీడియా నుండి ఒక అడుగు వెనక్కి వేస్తున్నాను. ప్రస్తుతానికి వర్చువల్ లైఫ్ కంటే నిజ జీవితంలో గడిపే క్షణాలకే నా మొదటి ప్రాధాన్యత. త్వరలోనే మళ్లీ కలుద్దాం’ అంటూ తెలిపింది.
కానీ నటిగా మాత్రం ఒక అద్భుతమైన కంబ్యాక్ ఇవ్వనుంది.. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ (Netflix) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ బిజినెస్’ (Family Business) లో రియా ఒక పవర్ఫుల్ పాత్రలో నటించనున్నారు.ఈ సిరీస్లో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, విజయ్ వర్మ, నేహా ధూపియా, ధృవ్ సెహగల్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో స్ట్రీమింగ్కు రాబోతుంది.
