పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్లో దూసుకుపోతోంది. వరుసగా భారీ ప్రాజెక్ట్లకు సైన్ చేస్తూ.. భారతీయ సినీ ఇండస్ట్రీలో తన క్రేజ్ను మరింత పెంచుకుంటున్నారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె నెక్స్ట్ లైనప్పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
రష్మిక ఇటీవలే షాహిద్ కపూర్తో కలిసి నటించిన ‘కాక్టెయిల్ 2’ మూవీ షూటింగ్ను పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సినిమా పూర్తయిన వెంటనే.. షాహిద్ కపూర్తో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్కు ఆమె సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘బదాయి హో’, ‘మైదాన్’ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. క్లాసిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే బాలీవుడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది.
Also Read: Surender Reddy-Pawan Kalyan: పవన్ కళ్యాణ్-సురేందర్ రెడ్డి మూవీ.. హీరోయిన్ ఎవరు?
బాలీవుడ్తో పాటు సౌత్లో కూడా రష్మిక బిజీ షెడ్యూల్ కొనసాగుతోంది. అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా(AA22xA6)లో రష్మిక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే ప్రాజెక్ట్గా భావిస్తున్నారు. అంతేకాదు విజయ్ దేవరకొండ ‘రణబాలి’, లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’ వంటి చిత్రాల్లో కూడా రష్మిక నటిస్తున్నారు. ఈ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి రష్మిక కెరీర్ ఇప్పుడు ఫుల్ స్పీడ్లో సాగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని సర్ప్రైజ్ ప్రాజెక్ట్లతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.