లక్కీ గర్ల్ రష్మిక మందన ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. దీంతో పాటు.. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్తో ఓ సినిమా, సిద్ధార్త్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిషన్ మంజు’ అనే సినిమాల్లో ఆమె నటిస్తోంది. ఇదిలావుంటే, కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన రష్మిక.. ఈ సినిమా హిందీ రీమేక్ కోసం ఆమెను సంప్రదించగా, చేయనని చెప్పిందట. అందుకు గల కారణాన్ని రీసెంట్ గా వెల్లడించింది. ‘నా ఉద్దేశంలో.. ఏదైనా పాత్ర చేసేటప్పుడు మొదటిసారి మాత్రమే ఎమోషన్స్గా బాగా చేయగలం. మళ్లీ మళ్ళీ అదే పాత్ర చేయడం నా వల్ల కాదు. నేనేప్పుడు కొత్త పాత్రల్ని, కథల్ని ప్రేక్షకులకు చెప్పేందుకు ఇష్టపడతాను. అందుకే ‘కిరిక్ పార్టీ’ రీమేక్లో నటించలేనని తెలిపాను’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.