గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు సన కాంబినేషన్లో రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న.. మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ (PEDDI) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతున్న ఈ చిత్రం, థియేట్రికల్ రిలీజ్కు ముందే తన బిజినెస్తో సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ (టీవీ ప్రసార) హక్కులకు సంబంధించిన ఒక సాలిడ్ డీల్ క్లోజ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఘనవిజయం తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పక్కా విలేజ్ రస్టిక్ డ్రామా కావడంతో ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ మరియు వృద్ధి సినిమాస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ఫిలిం నగర్ ట్రేడ్ వర్గాల ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘పెద్ది’ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ ‘జీ తెలుగు’ (Zee Telugu) ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. రామ్ చరణ్ క్రేజ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బుచ్చిబాబు స్క్రిప్ట్పై ఉన్న నమ్మకంతో ‘జీ’ సంస్థ మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్లో భారీ మొత్తాన్ని చెల్లించి ఈ హక్కులను లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో రన్ ముగిసిన తర్వాత బుల్లితెరపై మెగా పవర్ స్టార్ మాస్ రాంపేజ్ జీ తెలుగులోనే సందడి చేయనుంది.
