Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwath Marimuthu: సీనియర్ స్టార్ హీరోలతో సినిమా అంటే సాధారణంగా షూటింగ్ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇక పాన్ ఇండియా సినిమా అయితే ఈ వ్యవధి మరింత పెరుగుతుంది. కానీ సూపర్స్టార్ రజినీకాంత్తో ఓ యంగ్ డైరెక్టర్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. కేవలం ఐదు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి.. సంక్రాంతి బరిలో సినిమాను నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం చూస్తుంటే టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గుర్తుకు రావడం సహజమే. ఆయన కూడా తక్కువ సమయంలో సినిమాలను పూర్తి చేస్తూ.. వేగంగా రిలీజ్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో కోలీవుడ్లో ఓ యంగ్ డైరెక్టర్ రజినీకాంత్తో సినిమా చేస్తున్నాడు. ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అశ్వత్ మారిముత్తుకు రజినీకాంత్ స్వయంగా అవకాశం ఇచ్చినట్లు సమాచారం. పలువురు దర్శకుల పేర్లను పరిశీలించిన తర్వాత.. ‘తలైవర్ 173’ బాధ్యతలను అశ్వత్కు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు ‘ధర్మన్: ది డెడ్లీ డాక్టర్’ అనే టైటిల్ను మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో సిమ్రాన్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ పోతినేని కీలక పాత్రలో కనిపించనున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా తొలి షెడ్యూల్ పూర్తవగా.. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతోంది. తాజాగా అశ్వత్ మారిముత్తు ఒక ఇంటర్వ్యూలో తన సినిమా లైనప్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రజినీకాంత్తో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన ఆయన.. ఈ మూవీ షూటింగ్ను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అంటే షూటింగ్ స్టార్ట్ చేసిన ఐదు నెలల్లోనే రజినీకాంత్ వంటి సీనియర్ స్టార్తో పాన్ ఇండియా సినిమాను పూర్తి చేయాలని అశ్వత్ ప్లాన్ చేస్తున్నాడన్నమాట. దీంతో కోలీవుడ్లో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు.. ‘ధర్మన్’ను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక అశ్వత్ మారిముత్తు తన తదుపరి ప్రాజెక్ట్ను శింబుతో చేయనున్నాడు. వాస్తవానికి రజినీకాంత్ సినిమాకంటే ముందే శింబుతో సినిమా చేయాల్సి ఉంది. అయితే శింబు నటిస్తున్న ‘అరసన్’ షూటింగ్ ఆలస్యం కావడంతో.. అశ్వత్ ముందుగా రజినీకాంత్ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది. మరోవైపు అశ్వత్ మారిముత్తు ‘దయానగరం’ అనే సినిమాలో చిన్న పాత్రలో కూడా కనిపించనున్నట్లు సమాచారం. మొత్తంగా రజినీకాంత్తో పాన్ ఇండియా మూవీని ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయాలనే అశ్వత్ ప్లాన్ ఇప్పుడు కోలీవుడ్లో ఆసక్తిని పెంచుతోంది.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!