Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ ఇండస్ట్రీలో థియేటర్ల పర్సంటేజ్ విధానంపై వివాదం మరోసారి రాజుకుంది. ఈ అంశంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలు చేయడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారని, అయితే అది అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవరికీ నష్టం జరగని రీతిలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన ట్రేడ్ వర్గాల్లో కలకలం రేపే పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నట్టి కుమార్ మాట్లాడుతూ.. “రెంటల్ విధానంలో ఒక థియేటర్ కి రూ. 7.30 లక్షలు వస్తుందనుకుంటే, పర్సంటేజ్ పద్ధతిలో ఆ ఓనర్ రూ. 10 లక్షల వరకు ఆశించడంలో తప్పులేదు. కానీ, ఏకంగా పాతిక లక్షలు ఇవ్వాలని పట్టుబడితే అది ఎంతమాత్రం సహేతుకం కాదు. సినిమాల్లో నష్టాలు వస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునే నాథుడే లేడు. అప్పుల పాలై ఆస్తులు పోగొట్టుకున్న వాళ్లు ఎందరో ఉన్నారు. ‘అఖండ 2’ లాంటి సినిమాకు నష్టాలు వస్తే నిర్మాత గురించి ఎవరు మాట్లాడారు? పెద్ద సినిమాల పరిస్థితే ఇలా ఉంటే, ఇక చిన్న సినిమా నిర్మాతల ఇబ్బందులు వర్ణనాతీతం. ఎగ్జిబిటర్కి తన థియేటర్ ఒక సేఫ్ ప్రాపర్టీగా ఉంటుంది. కానీ హీరోలు తక్కువ సినిమాలు చేయడం వల్ల ప్రస్తుతం ఎగ్జిబిటర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు” అని విశ్లేషించారు.
Also Read
- Modi - Trump: ప్రపంచ దేశాల కళ్లు ఫ్రాన్స్పైనే.. జీ7 సదస్సులో చేతులు కలిపిన మోడీ - ట్రంప్! వాషింగ్టన్ టు ఢిల్లీ నయా జోష్..
- APFTDC : నంది అవార్డుల నిర్వహణపై ఏపీ ఫిలిం కార్పొరేషన్ కీలక అడుగు
- Arnold Vosloo: టాలీవుడ్లో ‘ది మమ్మీ’ విలన్ రచ్చ.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’లో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ!
- Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన పర్సంటేజ్ సబ్ కమిటీపై నట్టి కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఈ సబ్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్న డి. సురేష్ బాబు, దిల్ రాజు ఇద్దరూ నాకు వ్యక్తిగతంగా ఎంతో క్లోజ్. కానీ వారు లీజ్ ఓనర్స్ అవ్వడం వల్ల సహజంగానే ఎగ్జిబిటర్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనివల్ల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు అన్యాయం జరుగుతుందనే అనుమానాలు పరిశ్రమలో చాలామందికి ఉన్నాయి. అందుకే వారిద్దరూ ఈ కమిటీ నుండి తప్పుకోవాలి. వారి స్థానాల్లో కె.ఎల్. నారాయణ, శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి నిష్పాక్షికమైన వ్యక్తులను నియమించాలి. సురేష్ బాబు, దిల్ రాజు కావాలనుకుంటే కమిటీలో ఎగ్జిబిటర్ల తరపున నిలబడి వాదించుకోవచ్చు. నిజమైన బి-ఫారమ్ లైసెన్స్ ఉన్న థియేటర్ ఓనర్స్ కాకుండా, లీజ్ ఓనర్లే ఇప్పుడు చక్రం తిప్పుతూ తమకు భారీ లాభాలు వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆందోళన అందరిలోనూ ఉంది” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి
-
Tamil Nadu Politics: వరుస ఎదురుదెబ్బలు.. అన్నాడీఎంకే నుంచి మరో ఎమ్మెల్యే ఔట్
-
Modi – Trump: ప్రపంచ దేశాల కళ్లు ఫ్రాన్స్పైనే.. జీ7 సదస్సులో చేతులు కలిపిన మోడీ – ట్రంప్! వాషింగ్టన్ టు ఢిల్లీ నయా జోష్..
-
Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
-
Soft Pulka Tips: పుల్కాలు గట్టిగా వస్తున్నాయా? ఈ 2 సీక్రెట్ టిప్స్ పాటిస్తే బంతిలా పొంగుతాయి!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?