ప్రచార పర్వంలో ‘కోతికొమ్మచ్చి’
‘శతమానం భవతి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపును పొందిన దర్శకుడు సతీశ్ వేగేశ్న ప్రస్తుతం వినోద ప్రధాన చిత్రం ‘కోతికొమ్మచ్చి’ని తెరకెక్కిస్తున్నారు. రియల్ స్టార్ స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్ తో పాటు సతీశ్ వేగేశ్న కుమారుడు సమీర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. రిద్దికుమార్, మేఘా చౌదరి హీరోయిన్లు. వీరితో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. థియేటర్ కు వచ్చే ప్రేక్షకులను ఈ కరోనా సమయంలో మనస్ఫూర్తిగా నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకుని దీనిని తెరకెక్కించామని దర్శకుడు సతీశ్ వేగేశ్న చెబుతున్నారు. శుక్రవారం ఉదయం 9.30కి మూవీ థీమ్ సాంగ్ ను ‘దిల్’ రాజు ఆవిష్కరించి, తమ ‘కోతికొమ్మచ్చి’ ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారని సతీశ్ వేగేశ్న తెలిపారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
Also Read
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!