మెగాస్టార్ చిరంజీవి ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. దీనికి నాని నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్ట్పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే చిరు రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి సరైన హిట్ పడకపోవడంతో, మెగా అభిమానులు ఈ సినిమా అయిన వారి అంచానాలను అందుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. ఓదెల డైరెక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే.. చిరుతో ప్రాజెక్ట్ ని ఎలా దించుతాడో అనే ఆరాటంలో ఉన్నారు చిరు ఫ్యాన్స్. అయితే రాబోతున్న ఈ ప్రాజెక్ట్కు సంబంధించి తాజాగా సాలిడ్ అప్డేట్ను పంచుకున్నాడు నాని.
ప్రజంట్ నాని కూడా వరుస సినిమాలు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.. అందులో ‘హిట్ 3’ మే 01న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్లో షురూ చేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న నానిని చిరుఓదెలా ప్రాజెక్ట్ గురించి మీడియా అడుగగా.. దీనిపై స్పందించాడు ‘చిరుఓదెలా ప్రాజెక్ట్, ప్యారడైజ్ సినిమా తర్వాత స్టార్ట్ అవుతుంది. ‘ప్యారడైజ్’ మూవీ ఫినీష్ అవ్వగానే ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టి 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. ఈ చిత్రంలోని ప్రతి అప్డేట్ని సినిమా స్టార్ట్ అయ్యాక ప్రకటిస్తాం’ అంటూ నాని చెప్పుకోచ్చాడు. ఇక ‘ప్యారడైజ్’ కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుందని వెల్లడించాడు.