Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఒక భారీ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ సిద్ధమైంది. అదే “నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్”. ‘నిక్ స్టూడియోస్’ బ్యానర్పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ విజువల్ వండర్కు అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. హీరో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ లీడ్ రోల్స్ పోషిస్తోన్న ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొని, సినిమాకు సంబంధించిన ఎన్నో సంచలన విషయాలను పంచుకున్నారు.
ఐటీ రంగం నుండి ఇండస్ట్రీకి
నిర్మాతలు తమ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తూ.. “మేము సాఫ్ట్వేర్ కంపెనీని విజయవంతంగా రన్ చేసి, అక్కడి నుండి ఎగ్జిట్ అయ్యాక బిజినెస్ను విస్తరించాలనే ఉద్దేశంతో సినిమా రంగంలోకి వచ్చాం. మొదట ఒక పెద్ద హీరోతో సినిమా చేయాలనుకున్నా.. మేము కొత్తవాళ్లం కావడంతో ఆ ఛాన్స్ రాలేదు. ఆ సమయంలోనే అభిషేక్ నామా చెప్పిన లార్జర్ దాన్ లైఫ్ మైథాలజీ లైన్ మాకు మైండ్ బ్లాక్ చేసింది. కథ డెవలప్ అయ్యే కొద్దీ కంటెంట్పై మాకు నమ్మకం డబుల్ అయింది. అందుకే కొత్త హీరో, కొత్త డైరెక్టర్ అని చూడకుండా ఏకంగా రూ. 110 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించాం” అని స్పష్టం చేశారు.
Also Read
- Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ 'బంగారం'!
- Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్'తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
- Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
నిజమైన గుడిని తలపించే అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్!
ఈ సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒక విజువల్ వండర్ ప్రేక్షకులను థ్రిల్ చేయబోతోందని మేకర్స్ లీక్ ఇచ్చారు. “ఔట్డోర్ లొకేషన్స్లో మేము అనుకున్న గ్రాండియర్ రావడం సాధ్యం కాదనిపించింది. అందుకే ఎక్కడ విజువల్ ఎఫెక్ట్స్ వాడాలో, ఎక్కడ సెట్ వేయాలో పక్కా ప్లాన్ చేసుకున్నాం. ముఖ్యంగా ఈ సినిమా కోసం వేసిన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్ సినిమాకే ప్రాణం. ఆ సెట్ చూసిన ప్రతి ఒక్కరూ నిజమైన గుడిలోకి వెళ్లిన అనుభూతి కలుగుతోందని చెప్తున్నారు. మేము పెట్టిన ప్రతి పైసా సిల్వర్ స్క్రీన్ పై ఒక విజువల్ ఫీస్ట్లా కనిపిస్తుంది.”
రథయాత్ర ప్రమోషన్స్ సంచలనం!
సినిమా నిర్మాణంలో తమకు ఎదురైన ఆధ్యాత్మిక అనుభవాలను నిర్మాతలు గుర్తు చేసుకున్నారు. “మాకు దైవభక్తి ఎక్కువ. ప్రతిరోజూ శివుని అభిషేకంతోనే మా రోజు మొదలవుతుంది. మేము ఈ ఇండస్ట్రీకి వచ్చి ఇంత భారీ సినిమా తీయడం వెనుక అనంత పద్మనాభస్వామి, శివుడి అనుగ్రహం ఉందని నమ్ముతాం. కార్తీక పౌర్ణమి రోజున 24 గంటల పాటు అభిషేకం జరుగుతుండగా మా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. అలాగే మేము ప్రమోషన్స్ లో భాగంగా చేసిన రథయాత్ర వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.” అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
-
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!