Naga Babu: నీది నోరా మున్సిపాలిటీ కుప్పతొట్టా ? రోజా పై నాగబాబు ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagababu fire on Minister Roja: మంత్రి రోజాపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు. మెగా బ్రదర్స్ పైన రోజా చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్ అయ్యారు నాగబాబు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటించటం కాదని.. పర్యాటక శాఖను డెవలప్ చేయటమని చెప్పుకొచ్చారు. దేశంలో ఏపీ పర్యాటక శాఖ18వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. పాలన ఏం మాట్లాడినా స్పందించలేదని దానికి ఒకటే ఒక కారణమని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని నాగబాబు సూచించారు.
పవన్ కల్యాణ్ ను విమర్శించే క్రమంలో మంత్రి రోజా మెగా బ్రదర్స్ ను ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేసారు. దీనిపైన మోగా బ్రదర్స్ నాగబాబు ఒక వీడియో పోస్టు చేసారు. అందులో ఏపీలో టూరిజం శాఖ మంత్రి రోజాకు కొన్ని సూచనలు చేశారు. దేశంలో పర్యాటక రంగంలో ఏపీ 18వ స్థానంలో ఉందని కేరళ, అస్సాం, గుజరాత్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయని వివరించారు. ఇక ఏపీ తరువాత స్థానాల్లో చత్తీస్ ఘడ్, జార్ఖండ్ ఉన్నాయని తెలిపారు. ఏపీలో పర్యాటక శాఖ పైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి వేల మంది జీవిస్తున్నారని వివరించారు. ఇక.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారి జీవితాలు మట్టొ కొట్టుకు పోయాయయని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
- Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
- Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
- Peddi Ticket Prices Hike: 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. రోజుకు 5 షోలకు అనుమతి.!
Read also: BJP Meeting: నేడు బీజేపీ బూత్ కమిటీ సమ్మేళనం.. వర్చువల్గా మాట్లాడనున్న జేపీ నడ్డా, బండి సంజయ్
అన్నయ్య చిరంజీవి ఇప్పటి వరకు తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించి ఏం మాట్లాడినా స్పందించలేదన్నారు. నాగురించి మాట్లాడినా నేను పట్టించుకోలేదని చెప్పారు. ఇక మంత్రి రోజా తమ గురించి ఏం మాట్లాడినా పట్టించుకోకపోవటానికి కారణం ఒక్కటే.. రోజా నోటికి మున్సిపాల్టీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదన్నారు చూస్తా చూస్తా ఎవరూ కుప్పతొట్టిని గెలకరు అందుకే ఇప్పటి వరకు రోజా ఏం మాట్లాడినా నేను పట్టించుకోలేదన్నారు నాగబాబు.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలంటూ మంత్రి రోజాపై నాగబాబు ఫైర్ అయ్యారు.
మంత్రి రోజా తాజాగా చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యల పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మోగా బ్రదర్స్ ను సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని రోజా ఆరోపించిన విషయం తెలిసిందే.. అయితే సాధారణంగా సినీ నటులు సెన్సిటివ్ గా ఉంటారని, అందరికి సాయం చేస్థారని కానీ.. వీళ్లు మాత్రం అందుకు భిన్నమని రోజా విమర్శించింది. అందుకే రాజకీయాల్లో వీరిని ప్రజలు ఆదరించలేదని ఎద్దేవా చేశారు. పవన్, నాగబాబును జనసేన నేతలుగా మంత్రి రోజా టార్గెట్ చేసినా, చిరంజీవి ప్రస్తావన తేవడంతో చర్చ సాగుతోంది. ఒక తాజాగా బబర్ధస్త్ ఫేం గెటప్ శ్రీను కూత తన ఫేస్ బుక్ ద్వారా చిరంజీవి గురించి మంత్రి రోజా చేసి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన తీరు సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!