BJP Meeting: నేడు బీజేపీ బూత్ కమిటీ సమ్మేళనం.. వర్చువల్గా మాట్లాడనున్న జేపీ నడ్డా, బండి సంజయ్
BJP Booth Committee Meeting: తెలంగాణలో బీజేపీ ఎన్నికల వ్యూహం ఏంటి? పోలింగ్ బూత్ కేంద్రంగా కమలనాథులు ఏం చేస్తున్నారు? తమకు బలమని చెబుతున్న బూత్ కమిటీలు ఎంత వరకు వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవాళ బీజేపీ నేతలకు దొరకనుంది. తెలంగాణలో 34 వేలకుపైగా పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 250కిపైగా పోలింగ్ బూత్లు ఉంటాయి. వీటిపైనే దృష్టిపెట్టాయి బీజేపీ శ్రేణులు. వాస్తవానికి బీజేపీలో ఎన్నికల వ్యూహాలన్నీ పోలింగ్ బూత్ కేంద్రంగానే జరుగుతూ ఉంటాయి. బూత్ కమిటీలే తమ బలమని.. అవే తమను ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని భావిస్తారు నాయకులు. పోలింగ్ బూత్ను గెలిస్తే అసెంబ్లీని గెలిచినట్టేనని కమలనాథులు చెబుతారు.
తెలంగాణలోనూ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది బీజేపీ. పోలింగ్ బూత్ కమిటీలు వేయడంపై కసరత్తు చేస్తున్నారు నాయకులు. కొన్ని నెలలుగా ఈ అంశంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏమో.. అన్ని కమిటీలు వేశాం.. ఇన్ని కమిటీలు పూర్తయ్యాయి అని ఓ రేంజ్లో లెక్కలు వేసి.. బీజేపీ రాష్ట్ర ఆఫీసుకు పంపించారు జిల్లా నాయకులు. వారు ఇచ్చిన గణాంకాల ప్రకారం పార్టీకి రాష్ట్రంలో 25 వేల పోలింగ్ బూత్ కమిటీలు కొలిక్కి వచ్చాయట. ఒక్కో పోలింగ్ బూత్ కమిటీలో 22 మంది ఉండాలి. ఒక అధ్యక్షుడు.. ఒక సోషల్ మీడియా కన్వీనర్తోపాటు.. 20 మంది సభ్యులు ఉండాలి. ఈ లెక్కన చూస్తే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 4 వేల మంది బూత్ కమిటీ సభ్యులు ఉండాలి. ఇక రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల బలమే 5 లక్షలుగా లెక్క తేలుతోంది. చెప్పుకోవడానికి ఈ లెక్కలు ఘనంగా ఉన్నప్పటికీ.. వాస్తవ పరిస్థితిని తెలుసుకుని.. రాష్ట్రంలో తమ బలాన్ని అంచనా వేసుకోవడానికి చూస్తున్నారు కమలనాథులు.
Also Read
Read also: APPSC: గ్రూప్ 2 పరీక్షా విధానంలో మార్పులు.. ఉత్తర్వులు జారీ
ఇవాళ పోలింగ్ బూత్ సమ్మేళనాలను ఏర్పాటు చేసింది బీజేపీ. 119 నియోజకవర్గాల్లో ఈ సమ్మేళనాలు జరుగుతాయి. ఇక 34,600 బూత్ కమిటీలకు చెందిన 7.26 లక్షల మంది కార్యకర్తలు పాల్గొంటారు. అయితే.. వీరందరిని ఉద్దేశిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్గా మాట్లాడుతారు. కాగా.. అంతకుముందు బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి బండి సంజయ్ కూడా దిశానిర్దేశం చేస్తారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పార్టీ సభ్యుల రిజిస్ట్రేషన్ తో ఈ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది.. నెంబర్ 63591 19119కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో ఈ సమ్మేళనంలో భాగస్వాములవుతారు. ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల దాకా నడ్డా మాట్లాడనున్నారు..ఈ సమ్మేళనంలోనే ‘సరళ్’ యాప్ ను నడ్డా ప్రారంభిస్తారు.
వీటిని ఉద్దేశించి వర్చువల్గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగిస్తారు. ఈ సమావేశాలకు వచ్చే వారి సంఖ్య.. అలాగే బూత్ కమిటీల వాస్తవ చిత్రం పార్టీ నేతలకు అవగతం అవుతుంది. పేపరు మీద ఉన్న లెక్కలకు.. మీటింగ్కు వచ్చిన వారి లెక్కతో పోల్చుకుంటే పరిస్థితి తేటతెల్లం కానుంది. సంస్థాగతంగా బీజేపీ బలపడిందా లేదా? ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి? కమిటీల పేరుతో నాటకాలు ఆడింది ఎవరో తెలిసిపోతుందని కమలనాథులు చెబుతున్నారు. ఆ మేరకు అసెంబ్లీ ఎన్నికలకు ఏ స్థాయిలో పోరాటం చేయొచ్చో.. ఎంత వరకూ రాణించగలమో తెలుస్తుందని అనుకుంటున్నారు.
Saturday Special Govinda Namalu LIVE : శనివారం ఇంట్లో గోవింద నామాలు వింటే..
తాజావార్తలు
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
-
LSG vs KKR: కోల్కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!