Nag Ashwin : ఈతరం ప్రేక్షకులకు ఈ సినిమాని చూపించాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని హీరోగా, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’.విజయ్ దేవరకొండ ముఖ్యపాత్ర పోషించగా, మాళవిక నాయర్, రీతు వర్మ హీరోయిన్లు గా నటించారు. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్లో భాగంగా మార్చి 21న సినిమాని గ్రాండ్గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా విశేషాలు పంచుకున్నారు.
Also Read: Aditya 369 : రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఆదిత్య 369’
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘పదేళ్ల కిందట చిన్న రిలీజ్గా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి మార్కులు పడినప్పటికీ ఎక్కువ రోజులు మాత్రం ఆడలేదు. అందుకే ఈసారి మరింత భారీగా విడుదల చేస్తున్నాం. మనకు కొన్ని సినిమాలతో ప్రత్యేకమైన ప్రేమ, అనుబంధం ఉంటుంది. తెలుగులో నాకు అలాంటి చిత్రాలు మూడు నాలుగు ఉంటాయి. ఇక ‘ఎవడే సుబ్రమణ్యం’ మూవీ చూసి ఈ సినిమా గురించి నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లలోనూ అలాంటి ప్రేమనే కనిపించింది. పదేళ్లకు ముందు తీసిన ఈ సినిమా అప్పటి పరిస్థితులకు ఎంత దగ్గరగా ఉండేదో..ఇప్పటికీ మనం అదే పరుగులలో ఉన్నాం. అందుకే ఈతరం ప్రేక్షకులకు ఈ సినిమాని చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మొత్తానికి రీ రిలీజ్ అవుతుంది. ఈసారి మరింత మంది ఈ చిత్రాన్ని చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నా’ అని తెలిపారు. అలాగే ఆయన ఈ పదేళ్ల తన ప్రయాణం సంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ‘ ప్రతి సినిమాని మరొకరు చేయలేని ఓ కొత్త కాన్సెప్ట్ తీస్తున్నా. ‘కల్కి 2898 ఎ.డి’ విడుదలకు ముందు నాలో చాలా ఒత్తిడి ఉండేది. భారీ చిత్రం, ఎంతో బాధ్యత నాపై ఉంది. కానీ విడుదల తర్వాత ఫలితం ఎంతో తృప్తినిచ్చింది.ఇంతటి ఘన విజయం అందుకున్నందుకు ఆనందంగా ఉంది. ఓ మైలురాయి లాంటి సినిమా చేశాం. భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన సినిమాలు చేయగలమనే నమ్మకం వచ్చింది. ‘కల్కి 2’ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో ఆ సినిమాని ప్రారంభిస్తాం. ఈసారి సినిమాలో ప్రభాస్ పాత్ర పరిధి ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది’ అని అన్నారు నాగ్ అశ్విన్.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!