Nag Ashwin : ఈతరం ప్రేక్షకులకు ఈ సినిమాని చూపించాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని హీరోగా, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’.విజయ్ దేవరకొండ ముఖ్యపాత్ర పోషించగా, మాళవిక నాయర్, రీతు వర్మ హీరోయిన్లు గా నటించారు. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్లో భాగంగా మార్చి 21న సినిమాని గ్రాండ్గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా విశేషాలు పంచుకున్నారు.
Also Read: Aditya 369 : రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఆదిత్య 369’
Also Read
- Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- Kalyanam Kamaneeyam : రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో రస్టీ లవ్ స్టోరీ టీజర్!
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘పదేళ్ల కిందట చిన్న రిలీజ్గా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి మార్కులు పడినప్పటికీ ఎక్కువ రోజులు మాత్రం ఆడలేదు. అందుకే ఈసారి మరింత భారీగా విడుదల చేస్తున్నాం. మనకు కొన్ని సినిమాలతో ప్రత్యేకమైన ప్రేమ, అనుబంధం ఉంటుంది. తెలుగులో నాకు అలాంటి చిత్రాలు మూడు నాలుగు ఉంటాయి. ఇక ‘ఎవడే సుబ్రమణ్యం’ మూవీ చూసి ఈ సినిమా గురించి నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లలోనూ అలాంటి ప్రేమనే కనిపించింది. పదేళ్లకు ముందు తీసిన ఈ సినిమా అప్పటి పరిస్థితులకు ఎంత దగ్గరగా ఉండేదో..ఇప్పటికీ మనం అదే పరుగులలో ఉన్నాం. అందుకే ఈతరం ప్రేక్షకులకు ఈ సినిమాని చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మొత్తానికి రీ రిలీజ్ అవుతుంది. ఈసారి మరింత మంది ఈ చిత్రాన్ని చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నా’ అని తెలిపారు. అలాగే ఆయన ఈ పదేళ్ల తన ప్రయాణం సంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ‘ ప్రతి సినిమాని మరొకరు చేయలేని ఓ కొత్త కాన్సెప్ట్ తీస్తున్నా. ‘కల్కి 2898 ఎ.డి’ విడుదలకు ముందు నాలో చాలా ఒత్తిడి ఉండేది. భారీ చిత్రం, ఎంతో బాధ్యత నాపై ఉంది. కానీ విడుదల తర్వాత ఫలితం ఎంతో తృప్తినిచ్చింది.ఇంతటి ఘన విజయం అందుకున్నందుకు ఆనందంగా ఉంది. ఓ మైలురాయి లాంటి సినిమా చేశాం. భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన సినిమాలు చేయగలమనే నమ్మకం వచ్చింది. ‘కల్కి 2’ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో ఆ సినిమాని ప్రారంభిస్తాం. ఈసారి సినిమాలో ప్రభాస్ పాత్ర పరిధి ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది’ అని అన్నారు నాగ్ అశ్విన్.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?