రొటీన్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా, ప్రేక్షకులను ఉత్కంఠతో పాటు భావోద్వేగాలకు గురిచేసేలా సరికొత్త కాన్సెప్ట్తో వస్తున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఈ సినిమా క్లైమాక్స్లో వచ్చే ఊహించని ట్విస్ట్ (హుక్ పాయింట్) ఆడియన్స్ను ముమ్మాటికీ షాక్కు గురిచేస్తుందని, కోట్లు ఖర్చుపెట్టి, తమ రెండేళ్ల భవిష్యత్తును పణంగా పెట్టి ఈ సినిమా తీశామని, ఇది వచ్చి వెళ్లే సాధారణ సినిమా కాదని దర్శకుడు వాచస్పతి చాలా కాన్ఫిడెంట్గా చెబుతుండటం ఇప్పుడు టాలీవుడ్లో సంచలనంగా మారింది.
ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్పై పంచుమర్తి నరేష్ బాబు అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఎమోషనల్ థ్రిల్లర్పై ఉన్న నమ్మకంతో ఒక బడా నిర్మాణ సంస్థ ఈ సినిమా రిలీజ్ హక్కులను సొంతం చేసుకుని, ఈ నెల 18న ఏకంగా 150కి పైగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయబోతుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు సోషల్ మీడియాలో, ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆర్.ఆర్. ధృవన్ అందించిన సంగీతం చాలా ఫ్రెష్గా ఉందని యూత్ కనెక్ట్ అవుతున్నారు. దానికి తోడు టాప్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు విజువల్స్ సినిమాకు మేజర్ హైలైట్గా నిలవనున్నాయని టాక్ వినిపిస్తోంది. కంటెంట్, బిజినెస్ పరంగా సినిమా పట్ల తాను చాలా హ్యాపీగా ఉన్నానని నిర్మాత నరేష్ బాబు తెలిపారు. త్వరలోనే ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 18న థియేటర్లలోకి వస్తున్న ఈ ‘మిస్సింగ్ మేఘన’ ప్రేక్షకులను ఎంతమేర థ్రిల్ చేస్తుందో చూడాలి.

