MBU: ఇది కోర్టు ధిక్కరణ..యూనివర్సిటీ రద్దు ప్రచారంపై కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APHERMC) చేసిన కొన్ని సిఫార్సులపై మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మోహన్ బాబు విశ్వవిద్యాలయం (MBU) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు పేరుతో విడుదల చేసిన ప్రకటనలో, యూనివర్సిటీ ఈ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రకటన ప్రకారం, APHERMC సిఫార్సులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో (సబ్-జ్యుడిస్) ఉన్నాయి. ఈ అంశాన్ని పరిశీలించిన హైకోర్టు, APHERMC సిఫార్సులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయానికి అనుకూలంగా ‘స్టే’ ఉత్తర్వును జారీ చేసింది. అయితే, కోర్టు ఉత్తర్వును ధిక్కరించి APHERMC సదరు సిఫార్సులను పోర్టల్లో పెట్టడం దురదృష్టకరమని మంచు విష్ణు పేర్కొన్నారు.
Also Read : Aryan Khan-Sameer : ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వివాదం.. నెట్ఫ్లిక్స్కి నోటిసులు ఇచ్చిన దిల్లీ హైకోర్టు
Also Read
మోహన్ బాబు విశ్వవిద్యాలయం ఈ సిఫార్సులు సరికాదని గట్టిగా విశ్వసిస్తున్నట్లు, గౌరవనీయ హైకోర్టు న్యాయం చేకూరుస్తుందని విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన సమాచారాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని తల్లిదండ్రులకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయం భారతదేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఒకటిగా నిలుస్తోందని, రాయలసీమను ఉన్నత విద్యకు గుర్తింపు పొందిన కేంద్రంగా మారుస్తోందని ప్రకటనలో తెలిపారు. గత కొన్నేళ్లుగా, MBU ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు అత్యధిక ప్లేస్మెంట్లు మరియు వేతన ప్యాకేజీలను స్థిరంగా అందిస్తోందని, ఇది దేశంలోని అనేక ప్రభుత్వ లేదా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు సాధ్యపడని రికార్డు అని పేర్కొన్నారు.
Also Read : Guntur Murder: పొట్టిగా ఉన్నాడని బావని పొడిచి చంపిన బావమరిది..
1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్థాపించినప్పటి నుండి, ఈ విశ్వవిద్యాలయం బలమైన సామాజిక నిబద్ధతను కొనసాగిస్తోంది. ఉచిత విద్య, సాయుధ దళాలు/పోలీసు సిబ్బంది పిల్లలకు పూర్తి స్కాలర్షిప్పులు, అనాథలకు పూర్తి విద్య మరియు సంరక్షణ అందించడం వంటి సామాజిక సేవలను కొనసాగిస్తోంది అని పేర్కొన్నారు. మా గౌరవనీయ ఛాన్సలర్ డాక్టర్ ఎం. మోహన్ బాబు గారి మార్గదర్శకత్వంలో ప్రపంచ స్థాయి సమగ్ర విద్యను అందిస్తూ యువతను శక్తివంతం చేసే ప్రయత్నాన్ని కొనిసాగిస్తున్నామని మంచు విష్ణు ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు.
తాజావార్తలు
-
US-Iran: 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు.. పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన
-
Nagarjuna: మనోడు లెనిన్ 10th జులై వస్తున్నాడు!
-
Bangladesh: క్రికెటర్పై పోలీసుల దాడి.. బంగ్లాదేశ్లో కలకలం
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Smart Kitchen Hacks: వంటింట్లో ఇలా చేస్తే శ్రమ, సమయం, డబ్బు ఆదా.. గృహిణులకు మోస్ట్ యూస్ఫుల్ టిప్స్!
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!