‘మా’ కాంట్రవర్సీ : జైలుకెళ్ళాల్సిన వాళ్ళు… విష్ణు సంచలన ఆరోపణలు
టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు సంబంధించిన ఎన్నికల విషయం వేడెక్కుతోంది. అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ నెలకొంది. తాజాగా మంచు విష్ణు చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మూవీ ఆర్టిస్ట్ ల మధ్య యూనిటీ లేదని ఆయన అన్నారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, దాసరి నారాయణరావు చెప్తే అందరూ విన్నారని, దాసరి పోయాక ఇండస్ట్రీలో కొరత ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ కి పెద్దదిక్కు అనేది లేకుండా పోయిందని, సినిమా పెద్దలు అందరూ కలిసి ఏకగ్రీవంగా ‘మా’కు ఏదైనా మంచి చేద్దాం అంటే నేను కూడా కచ్చితంగా వింటాను అంటూ చెప్పుకొచ్చారు. ‘మా’ భవనం అనేది తన ప్రధాన ఎజెండా కాదని, ఆర్టిస్టులకు సంబంధించిన సమస్యలు, ప్రొడక్షన్ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఆర్టిస్టుల సంఘం అధ్యక్షులు తెలుగు వాళ్లు కావాలని తాను అనలేదని, కానీ మెంబర్లు కాని వాళ్లు మాత్రం పోటీ చేయొద్దని వెల్లడించారు.
Read Also : పోర్నోగ్రఫీ కేసు… రాజ్ కుంద్రా బిగ్గెస్ట్ కాంట్రవర్సీలు!
Also Read
- Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
అంతేకాకుండా మెంబర్లు కాని వాళ్లకు సినీ పరిశ్రమలో అవకాశాలు ఇవ్వకూడదు అని అన్నారు. ‘మా’ కోసం ఇంకా ఎవరూ పోటీ చేయకముందే తనను పోటీ చేయమని కొందరు పెద్దలు సూచించారని అంటూనే ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న గొడవలను తాను బయట పెట్టనని అన్నారు. మా ఎన్నికల గురించి అందరూ మాట్లాడడం ఆపేయాలని, ఇక్కడ ఏదో బీభత్సం జరిగిపోతుందని అందరూ అనుకుంటున్నారు అని ఆయన అన్నారు. అధ్యక్ష పదవిలో ఉన్నా లేకపోయినా ‘మా’ భవనాన్ని నిర్మిస్తానని, దానికి బాలయ్య కూడా సాయం చేస్తాను అన్నాడని చెప్పుకొచ్చారు. ఇక కొందరు కరోనా కష్టకాలంలో సాయం చేసి టామ్ టామ్ చేసుకుంటున్నారని, కానీ ఇండస్ట్రీ లో ఎంతోమంది అలా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు అని, మంచి చేసినప్పుడు ప్రచారం చేస్తే అది ఇంకొందరికి స్ఫూర్తి అవుతుందని, కానీ వాళ్లకు వాళ్లే ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. అలాగే గతంలో జైలుకెళ్లాల్సిన కొంతమందిని ఎవరు కాపాడారో వాళ్ళని అడిగితేనే తెలుస్తుందని, వాళ్ళు శృతి మించితే పేర్లు బయట పెట్టాల్సి వస్తుందని మంచు విష్ణు గట్టిగానే హెచ్చరించారు. ఆయన ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఇప్పుడు అంతా జైలుకెళ్లాల్సిన వాళ్ళు ఎవరూ అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!