Lokesh Kanagaraj: లోకేశ్ కనగరాజ్ హీరోగా మూవీ
- దర్శకుడిగా సక్సెస్ సాధించిన లోకేశ్ కనగరాజ్
- ఇప్పుడు హీరోగా ఎంట్రీకి రెడీ!
- కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న నూతన ప్రాజెక్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకేశ్ కనగరాజ్ రెండేళ్ల పడ్డ టెన్షన్కు ఆగస్టు 14కి తెరపడింది. కూలీ రిజల్ట్ వచ్చేయడంతో రిలాక్స్ అవుతున్నాడు లోకీ. ఈ ప్రాజెక్ట్ వల్ల కాస్త నెర్వస్ ఫీలైన లోకీ సోషల్ మీడియాకు కాస్త బ్రేక్ ఇవ్వగా, రీసెంట్గా మూవీ అప్డేట్స్తో ఫ్యాన్స్తో టచ్లోకి వచ్చేశాడు. ఇక నెక్ట్స్ కార్తీతో *ఖైదీ 2*ని ప్లాన్ చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్, మెగాఫోన్కు కాస్త గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పటి వరకు తెర వెనుక కనబడిన తాను, ఇకపై తెర ముందుకు రావాలని డిసైడ్ అయ్యాడు.
Also Read:Kishkindhapuri : కిష్కిందపురి టీజర్ రిలీజ్.. భయపెట్టేస్తున్న బెల్లంకొండ..
Also Read
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు లోకేశ్ కనగరాజ్. ఇప్పటికే దర్శకుడ్ని కూడా సెట్ చేశాడు. తనను హీరోగా నిలబెట్టే బాధ్యతను *కెప్టెన్ మిల్లర్* ఫేం అరుణ్ మాథేశ్వరన్ భుజాన వేసుకున్నాడు. ధనుష్తో ఇళయరాజా బయోపిక్ తీయాల్సి ఉండగా, *కుబేర* హీరో వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండి, అరుణ్కు హ్యాండ్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుండటంతో, లోకీ ఇచ్చిన ఆఫర్ను పరమాన్నంలా స్వీకరించి అటు షిఫ్ట్ అయ్యాడు అరుణ్.
Also Read:Minister Anagani: స్త్రీ శక్తి స్కీమ్ కారణంగా కొత్త పాస్ బుక్స్ రిలీజ్ వాయిదా పడింది..
హీరో కావాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న లోకీ, ఓ ట్రయల్ వెయ్యాలని భావిస్తున్నాడు. గతంలో ఓ స్పెషల్ సాంగ్లో శృతితో కలిసి యాక్ట్ చేశాడు లోకీ. పర్ఫార్మెన్స్ ఓకే అనిపించుకోవడంతో, హీరోగా కంటిన్యూ కావాలని అనుకుంటున్నాడు. అయితే ఈ ప్రాజెక్టును అనుకున్న టైంలోనే కంప్లీట్ చేయాలని అరుణ్కు లోకీ కండిషన్ పెట్టాడని టాక్. ఇది కంప్లీట్ కాగానే *ఖైదీ 2*కి షిఫ్ట్ అయ్యిపోనున్నాడు డైరెక్టర్. త్వరలో దర్శకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తానంటోన్న లోకీని హీరోగా కోలీవుడ్ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్నది త్వరలో తేలిపోనుంది.
తాజావార్తలు
-
PM Modi: భారత్కు రూ.3,311 కోట్ల భారీ పెట్టుబడులు.. ఆస్ట్రేలియన్ సూపర్ ప్రకటనను స్వాగతించిన ప్రధాని మోడీ
-
Rishabh Agarwal: రూ.8.5 కోట్ల జాబ్కు నో చెప్పిన భారతీయ కుర్రాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
-
Musi Riverfront Project: రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతి.. 21 కి.మీ. మేర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్.!
-
CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
-
Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!