‘రాధేశ్యామ్’ షూటింగ్ పూర్తిచేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ‘సలార్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ పై దూకుడు పెంచాడు. హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ను స్టార్ట్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్పై ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ నటించనుందని తెలుస్తోంది. ఈమేరకు ఆమెను సంప్రదించినట్లు సమాచారం. కత్రినా సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో సలార్ స్థాయి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.