New Railway Line: తెలంగాణ, ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైల్వే ప్రాజెక్ట్పై అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ–కాజీపేట మధ్య అత్యంత కీలకమైన మూడో రైల్వే లైన్, విద్యుదీకరణ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా తుది దశకు చేరుకుంటున్నాయి. దక్షిణ మధ్య రైల్వే నెట్వర్క్లో ఈ మార్గం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో, ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడం రవాణా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలవనుంది. మొత్తం 219 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టును భారత రైల్వే అత్యంత ప్రాధాన్యతతో చేపట్టింది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటికే 199 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ , విద్యుదీకరణ పనులు విజయవంతంగా పూర్తయి, రైళ్ల రాకపోకలకు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన కొద్దిపాటి పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
ఈ మూడో రైల్వే లైన్ అందుబాటులోకి రావడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా విజయవాడ–కాజీపేట మధ్య నిరంతరం కొనసాగే రైళ్ల రద్దీ ఈ కొత్త లైన్ వల్ల గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల ప్రయాణీకుల రైళ్లు ఆలస్యం కాకుండా సమయానికి నడిచే అవకాశం ఉంటుంది. ఈ మార్గం ప్రధానంగా బొగ్గు, సిమెంట్ రవాణాకు కీలక కేంద్రం. మూడో లైన్ ద్వారా గూడ్స్ రైళ్ల రాకపోకలు వేగవంతమై, పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు సకాలంలో చేరుతాయి. అంతే కాకుండా.. ప్రాజెక్ట్లో భాగంగా జరిగిన పూర్తిస్థాయి విద్యుదీకరణ వల్ల ఇంధన ఖర్చులు తగ్గడమే కాకుండా, పర్యావరణహితమైన రవాణా సాధ్యమవుతుంది.
Also Read
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
Also Read:US-Iran Plan: అలా అయితే హార్ముజ్ ఓపెన్ చేయం.. సంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..
ఈ రైల్వే లైన్ అభివృద్ధి కేవలం రవాణా సౌకర్యాలకే పరిమితం కాకుండా.. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్థిక వారధిగా నిలవనుంది. ఈ మార్గం వెంబడి ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు, వ్యవసాయ మార్కెట్లు వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల స్థానిక వ్యాపారవేత్తలకు, కార్మికులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు కనెక్టివిటీ పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. మొత్తానికి.. విజయవాడ–కాజీపేట మూడో లైన్ ప్రాజెక్ట్ పూర్తికావడం అనేది తెలుగు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధిలో ఒక కీలక మలుపుగా మారనుంది.
తాజావార్తలు
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!