Kantara : కాంతార టీమ్లో వరుస మరణాలపై స్పందించిన నిర్మాత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడలో బ్లాక్బస్టర్ హిట్ సాధించిన ‘కాంతార’ సినిమా, దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఆ చిత్రానికి ప్రీక్వెల్గా రూపొందుతున్న కాంతార చాప్టర్ 1 చుట్టూ ప్రస్తుతం రహస్యాలు, అపోహలు, గాసిప్స్ తిరుగుతున్నాయి. పౌరాణిక శక్తుల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, నిర్మాణ దశలోనే చాలా సమస్యలు ఎదురుకుంది. చిత్రబృందంలోని నలుగురు సభ్యుల మరణాలు, షూటింగ్ స్పాట్లో జరిగిన ప్రమాదాలు, ఇంకా సినిమాలో కనిపించిన దున్నపోతు మృతి.. ఈ సంఘటనలతో కాంతార టీమ్ను ఏదో దుష్టశక్తి వెంటాడుతోందా? అన్న సందేహాలను రేకెత్తించాయి. మీడియా కూడా ఈ అంశాలను హైలైట్ చేయడంతో, ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే ఎట్టకేలకి, చిత్ర నిర్మాత చలువే గౌడ ఈ విషయంపై స్పందించారు.
Also Read : Coolie : ఏంటి.. కూలీ సినిమాకి నాగార్జున మరీ అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారా?
Also Read
‘మా సినిమాపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. కొన్ని కథనాలు పూర్తిగా తప్పు. అవును, కొన్ని ప్రమాదాలు జరిగినా, ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. 2025లో ఒకసారి సెట్లో అగ్నిప్రమాదం జరిగింది, కానీ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అలాగే, ఒకసారి నదిలో పడవ మునిగింది అప్పుడు కెమెరాలు, పరికరాలు మాత్రమే దెబ్బతిన్నాయి” అని వివరించారు. అలాగే, సినిమా షూటింగ్ మొదలుపెట్టే ముందు పంజుర్లి అమ్మవారిని దర్శించుకున్నామని, ఆమె దివ్యదర్శనంలో కొంత అడ్డంకులు వచ్చినా, చివరికి చిత్రీకరణ విజయవంతంగా పూర్తవుతుందని చెప్పారు. ‘ప్రతిరోజూ తెల్లవారుఝామున 4 గంటలకు లేచి, 6 గంటలకు షూటింగ్ మొదలుపెట్టేవాళ్లం. మధ్యలో ఎన్నో విమర్శలు ఎదురైనా, ఇప్పుడు ఫుటేజ్ చూసి చాలా సంతృప్తిగా ఉంది’ అని చలువే గౌడ తెలిపారు. ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీని 2025 అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీమ్ సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
-
Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
-
Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!