టాలీవుడ్లో వినూత్నమైన కథలతో, సరికొత్త కాన్సెప్ట్లతో వచ్చే చిత్రాలకు ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అదే బాటలో, ప్రేమ మరియు సస్పెన్స్ ఎలిమెంట్స్తో ఒక ఉత్కంఠభరితమైన సైకో-రోమాంటిక్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న చిత్రం “కళ్యాణం కమనీయం జీవితం”. ‘వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ’పై ఖాన్ దురాని, సాహితి ఆవంచ లీడ్ రోల్స్లో.. డైరెక్టర్ రవి లోకిరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. తాజాగా ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను టాలీవుడ్ లెజెండరీ రైటర్, విజయేంద్ర ప్రసాద్ గ్రాండ్గా ఆవిష్కరించి చిత్ర యూనిట్కు తన బ్లెస్సింగ్స్ అందించారు.
పోస్టర్ లాంచ్ చేసిన అనంతరం ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది. డిస్ట్రిబ్యూటర్ రాజవంశీ నాకు ఈ టైటిల్ గురించి చెప్పగానే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. పోస్టర్ చూస్తుంటేనే దర్శకుడి విజన్ ఏంటో క్లియర్ గా అర్థమవుతోంది. నిర్మాతలు ఒక మంచి ప్రయత్నం చేశారు. చిత్ర యూనిట్ మొత్తానికి నా ఆల్ ది బెస్ట్” అని కొనియాడారు. దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. “మహామహుడు విజయేంద్ర ప్రసాద్ మా చిత్ర పోస్టర్ను రిలీజ్ చేయడంతోనే సగం సక్సెస్ సాధించినంత హ్యాపీగా ఉంది. నా కథను నమ్మి నాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చిన ప్రొడ్యూసర్లకు థాంక్స్. ఇదొక ప్యూర్ లవ్ స్టోరీలా కనిపిస్తూనే.. ఊహించని సస్పెన్స్ ఎలిమెంట్స్తో ఆడియన్స్కు ఒక అద్భుతమైన ఉత్కంఠభరితమైన రైడ్ను అందిస్తుంది. మా టీమ్ అంతా ప్రాణం పెట్టి పనిచేశాం” అని వెల్లడించారు.

