కాజల్ అగర్వాల్, నటుడు శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరి’ (The India Story: Slow Poison in Progress). దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే సమకాలీన అంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ గ్రిప్పింగ్ సోషియో-నేషనల్ డ్రామా విడుదలకు ముహూర్తం ఖరారైంది. జీ స్టూడియోస్, ఎంఐజి ప్రొడక్షన్ & స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చేత్తన్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కాబోతుండటం విశేషం.
కుటుంబ కథా చిత్రాలు, వినోదానికే ప్రాధాన్యత ఇస్తున్న మేకర్స్ ఒకపక్క ఉండగా మరోపక్క ఇప్పుడు సమాజానికి మేలు చేసే వాస్తవ గాథలపై దృష్టి పెడుతున్నారు. ‘ది ఇండియా స్టోరి’ కూడా అటువంటి కోవకే చెందుతుంది. కెమికల్స్ దుర్వినియోగం, సాగులో పురుగుమందుల మితిమీరిన వినియోగం, దీని వెనుక ఉన్న భారీ కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుంది. నేటి ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బలమైన సందేశం, ఆలోచింపజేసే స్క్రీన్ప్లే, మరియు స్టార్ నటీనటుల పెర్ఫార్మెన్స్తో వస్తున్న ‘ది ఇండియా స్టోరి’ బాక్సాఫీస్ వద్ద కూడా తన ప్రభావం చూపే అవకాశం ఉంది.
