Karthi : తండేల్ రియల్ స్టోరీ అని తెలిసి ఆశ్చర్యపోయాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. తాజాగా గురువారం ఈ మూవీ తమిళ ట్రైలర్ను చెన్నైలో విడుదల చేశారు. కోలీవుడ్ స్టార్ కార్తి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ను విడుదల చేశారు.
ఈ సందర్బంగా కార్తీ మాట్లాడూతూ ‘‘నాకు టాలీవుడ్లో చాలా గొప్ప ప్రేమ దొరికింది. తండేల్ మూవీ 2018లో జరిగిన రియల్ స్టోరీ అని తెలిసి ఆశ్చర్యపోయాను. మన జాలర్లు పాకిస్థాన్కు వెళ్లి అక్కడి వారికి దొరికిపోవటం, అక్కడి నుంచి తప్పించుకని రావటం ఇదంతా చక్కటి ప్రేమ కథగా తెరకెక్కించారు. 20 మంది దగ్గర రైట్స్ తీసుకుని, మూడేళ్లు స్క్రిప్ట్ తయారు చేసి, ఏడాదిన్నర పాటు షూటింగ్ చేశారంటే ఆ సినిమా అంటే వాళ్లకెంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. చందు మొండేటి కెరీర్లో చాలా హిట్ మూవీస్ చేశారు. అదే కోవలో ఈ సినిమాను ఎంతగానో నమ్మి ఈ సినిమా కోసం అద్భుతమైన సినిమాగా చేశారు. అల్లు అరవింద్ చాలా ఏళ్లుగా నిర్మాతగా కొనసాగుతున్నారంటే మామూలు విషయం కాదు కేవలం బిజినెస్ మాత్రమే కాదు, ప్యాషన్ కూడా ఉండాలి. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. తండేల్ చాలా పెద్ద సక్సెస్ను సాధించాలి. దేవిశ్రీప్రసాద్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. సాయిపల్లవి చేసే ప్రతీ పాత్రను అద్భుతంగా చేస్తుంది. ప్రతీ ఎమోషన్ను చక్కగా పలికిస్తుంది. అందుకనే అందరికీ తను ఎంతగానో నచ్చుతుంది. ఎ.ఎన్.ఆర్గారు, నాగార్జునగారితో ఇక్కడి వారికి మంచి అనుబంధం ఉంది. నేను నాగార్జునతో కలిసి పని చేశాను కూడా. నాగ చైతన్య ఇన్నోసెన్స్లా కనిపించే అద్భుతమైన యాక్టర్. తనపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించకుండా ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. తండేల్ కోసం ఎంతో కష్టపడ్డారు. ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతోన్న సినిమా తమిళంలో పెద్ద హిట్ అవుతుంది. సినిమాను తమిళంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రభుకి అభినందనలు’’ అన్నారు.
Also Read
తాజావార్తలు
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!