Devi Sri Prasad: విశాఖలో దేవి శ్రీ మ్యూజికల్ నైట్ ప్రోగ్రాంపై ఉత్కంఠ.. అసలు ఏమవుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ) మ్యూజికల్ నైట్ కార్యక్రమం విశాఖపట్నంలో జరగాల్సి ఉండగా, చివరి క్షణంలో అనుమతుల సమస్యలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఏప్రిల్ 19న జరగాల్సిన ఈ మ్యూజికల్ కాన్సర్ట్కు విశాఖ పోలీసులు భద్రతా కారణాలతో అనుమతులు నిరాకరించడంతో నిర్వాహకులు, అభిమానులు ఆందోళనలో ఉన్నారు. విశాఖలోని విశ్వనాథ్ కన్వీన్షన్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని మొదట నిర్ణయించారు. అయితే, ఇటీవల ఈ వేదికలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు. గతంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లోని వాటర్ వరల్డ్లో జరిగిన ఒక దుర్ఘటనలో ఒక బాలుడు మృతి చెందిన ఘటన నేపథ్యంలో, అధికారులు ఈ ప్రదేశాన్ని తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కారణంగా, విశాఖ పోలీసులు నాలుగు సార్లు ఈ మ్యూజికల్ నైట్కు అనుమతులను తిరస్కరించారు. సిపి శంఖబ్రత బాగ్చీ ఈ నిర్ణయం వెనుక భద్రతా సమస్యలే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
Shine Tom Chako: డ్రగ్స్ రైడ్ తప్పించుకునేందుకు సాహసం.. 3వ ఫ్లోర్ నుంచి దూకి మరీ పరార్!
Also Read
- Jananayagan : విజయ్ 'జననాయకుడు' ఓవర్సీస్ రివ్యూ.. వద్దు బ్రో
- 2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
- Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
- Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
పోర్ట్ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. స్టేడియం సామర్థ్యం కేవలం 3,000 మంది మాత్రమే కాగా, నిర్వాహకులు ఇప్పటికే ఆన్లైన్లో సుమారు 10,000 టికెట్లను అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో భద్రతా సమస్యలు ఉంటాయని భావించి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పార్కింగ్ సమస్యలతో పాటు, ఏదైనా ప్రమాదం జరిగితే ఈవెంట్ ప్రాంతం నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. అయితే అనుమతులు లేకపోయినప్పటికీ, దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. ఆయన అభిమానులు ఈ కార్యక్రమం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. టికెట్లు భారీగా అమ్ముడైన నేపథ్యంలో, చివరి క్షణంలో అనుమతులు రద్దు కావడంతో నిర్వాహకులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్ విశాఖలో జరిగే అవకాశం ప్రస్తుతానికి సందిగ్ధంగానే ఉంది. భద్రతా సమస్యలను పరిష్కరించి, తగిన అనుమతులు పొందేందుకు నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది త్వరలో తేలనుంది.
తాజావార్తలు
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
-
India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!