Devi Sri Prasad: విశాఖలో దేవి శ్రీ మ్యూజికల్ నైట్ ప్రోగ్రాంపై ఉత్కంఠ.. అసలు ఏమవుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ) మ్యూజికల్ నైట్ కార్యక్రమం విశాఖపట్నంలో జరగాల్సి ఉండగా, చివరి క్షణంలో అనుమతుల సమస్యలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఏప్రిల్ 19న జరగాల్సిన ఈ మ్యూజికల్ కాన్సర్ట్కు విశాఖ పోలీసులు భద్రతా కారణాలతో అనుమతులు నిరాకరించడంతో నిర్వాహకులు, అభిమానులు ఆందోళనలో ఉన్నారు. విశాఖలోని విశ్వనాథ్ కన్వీన్షన్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని మొదట నిర్ణయించారు. అయితే, ఇటీవల ఈ వేదికలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు. గతంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లోని వాటర్ వరల్డ్లో జరిగిన ఒక దుర్ఘటనలో ఒక బాలుడు మృతి చెందిన ఘటన నేపథ్యంలో, అధికారులు ఈ ప్రదేశాన్ని తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కారణంగా, విశాఖ పోలీసులు నాలుగు సార్లు ఈ మ్యూజికల్ నైట్కు అనుమతులను తిరస్కరించారు. సిపి శంఖబ్రత బాగ్చీ ఈ నిర్ణయం వెనుక భద్రతా సమస్యలే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
Shine Tom Chako: డ్రగ్స్ రైడ్ తప్పించుకునేందుకు సాహసం.. 3వ ఫ్లోర్ నుంచి దూకి మరీ పరార్!
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
- NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ - మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
- Pawan Kalyan: 'పవన్ కళ్యాణ్' నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
పోర్ట్ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. స్టేడియం సామర్థ్యం కేవలం 3,000 మంది మాత్రమే కాగా, నిర్వాహకులు ఇప్పటికే ఆన్లైన్లో సుమారు 10,000 టికెట్లను అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో భద్రతా సమస్యలు ఉంటాయని భావించి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పార్కింగ్ సమస్యలతో పాటు, ఏదైనా ప్రమాదం జరిగితే ఈవెంట్ ప్రాంతం నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. అయితే అనుమతులు లేకపోయినప్పటికీ, దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. ఆయన అభిమానులు ఈ కార్యక్రమం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. టికెట్లు భారీగా అమ్ముడైన నేపథ్యంలో, చివరి క్షణంలో అనుమతులు రద్దు కావడంతో నిర్వాహకులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్ విశాఖలో జరిగే అవకాశం ప్రస్తుతానికి సందిగ్ధంగానే ఉంది. భద్రతా సమస్యలను పరిష్కరించి, తగిన అనుమతులు పొందేందుకు నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది త్వరలో తేలనుంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!