Shraddha Kapoor: ప్రభాస్ నటికి ఈడీ సమన్లు.. విచారణకు హాజరవుతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Kapoor: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు బాలీవుడ్ ను షేక్ చేస్తోంది.. మహదేవ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేస్తున్న నటీనటుల జాబితాలో తాజాగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కూడా చేరింది. అంతకుముందు గురువారం దుబాయ్లో జరిగిన మహాదేవ్ బుక్ యాప్ సక్సెస్ పార్టీకి హాజరైనందుకు హాస్యనటుడు కపిల్ శర్మ, యాప్ను ప్రమోట్ చేశారనే ఆరోపణలపై హుమా ఖురేషి, హీనా ఖాన్లను ప్రోబ్ ఏజెన్సీ సమన్లు చేసింది. నటి శ్రద్ధా కపూర్కు సమన్లు పంపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ – ఈడీ.. ఇవాళ విచారణకు రావాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె విచారణకు హాజరవుతారా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
ఈ కేసులో ఇప్పటికే స్టార్ నటుడు రణబీర్ కపూర్, కమెడియన్ కపిల్ శర్మ, హుమా ఖురేషి, హీనా ఖాన్లకు ఈడీ సమన్లు జారీ చేసింది. నేడు రాయ్పూర్లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో జరిగే విచారణకు రణ్బీర్ కపూర్ కూడా హాజరు కావాల్సి ఉండగా, రెండు వారాల సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. కపిల్ శర్మ, హుమా ఖురేషి, హీనా ఖాన్లను వేర్వేరు తేదీల్లో విచారించనున్నట్లు అధికారులు తెలిపారు. కానీ మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్ మరియు రవి ఉప్పల్ భారతదేశంలో 4000 మంది ఆపరేటర్లను నియమించుకున్నారు.
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
ఒక్కో ఆపరేటర్కు దాదాపు 200 మంది కస్టమర్లు ఉన్నారు. ఆ లెక్కన రోజుకు రూ.200 కోట్లు చేతులు మారుతున్నాయి. 70-30 నిష్పత్తిలో లాభాలను పంచుకోవడానికి వివిధ దేశాల్లో బీటర్లను నియమించారు. యూఏఈలో ఈ యాప్ కార్యకలాపాలు ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. సౌరభ్, రవి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. కానీ ED ఛార్జ్ ఏమిటంటే, నటీనటులు యాప్ను ఆన్లైన్లో ప్రచారం చేసి, బదులుగా ప్రమోటర్ల నుండి పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నారని సమాచారం. ఈ కేసులో 14 నుంచి 15 మంది ప్రముఖులు, నటీనటుల పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. మరికొందరికి త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ కేసులో వారు నిందితులు కాదని, హవాలా కేసులో చెల్లింపులు ఎలా జరిగాయనే విషయమై వారిని విచారించనున్నట్లు సమాచారం.
Rekha Naik: నేడు బీఆర్ఎస్కు రేఖా నాయక్ రాజీనామా..! ఇండిపెండెంట్ గా పోటీ..?
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!