Shraddha Kapoor: ప్రభాస్ నటికి ఈడీ సమన్లు.. విచారణకు హాజరవుతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Kapoor: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు బాలీవుడ్ ను షేక్ చేస్తోంది.. మహదేవ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేస్తున్న నటీనటుల జాబితాలో తాజాగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కూడా చేరింది. అంతకుముందు గురువారం దుబాయ్లో జరిగిన మహాదేవ్ బుక్ యాప్ సక్సెస్ పార్టీకి హాజరైనందుకు హాస్యనటుడు కపిల్ శర్మ, యాప్ను ప్రమోట్ చేశారనే ఆరోపణలపై హుమా ఖురేషి, హీనా ఖాన్లను ప్రోబ్ ఏజెన్సీ సమన్లు చేసింది. నటి శ్రద్ధా కపూర్కు సమన్లు పంపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ – ఈడీ.. ఇవాళ విచారణకు రావాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె విచారణకు హాజరవుతారా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
ఈ కేసులో ఇప్పటికే స్టార్ నటుడు రణబీర్ కపూర్, కమెడియన్ కపిల్ శర్మ, హుమా ఖురేషి, హీనా ఖాన్లకు ఈడీ సమన్లు జారీ చేసింది. నేడు రాయ్పూర్లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో జరిగే విచారణకు రణ్బీర్ కపూర్ కూడా హాజరు కావాల్సి ఉండగా, రెండు వారాల సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. కపిల్ శర్మ, హుమా ఖురేషి, హీనా ఖాన్లను వేర్వేరు తేదీల్లో విచారించనున్నట్లు అధికారులు తెలిపారు. కానీ మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్ మరియు రవి ఉప్పల్ భారతదేశంలో 4000 మంది ఆపరేటర్లను నియమించుకున్నారు.
Also Read
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్గా మారిన ఫోటోలు!
ఒక్కో ఆపరేటర్కు దాదాపు 200 మంది కస్టమర్లు ఉన్నారు. ఆ లెక్కన రోజుకు రూ.200 కోట్లు చేతులు మారుతున్నాయి. 70-30 నిష్పత్తిలో లాభాలను పంచుకోవడానికి వివిధ దేశాల్లో బీటర్లను నియమించారు. యూఏఈలో ఈ యాప్ కార్యకలాపాలు ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. సౌరభ్, రవి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. కానీ ED ఛార్జ్ ఏమిటంటే, నటీనటులు యాప్ను ఆన్లైన్లో ప్రచారం చేసి, బదులుగా ప్రమోటర్ల నుండి పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నారని సమాచారం. ఈ కేసులో 14 నుంచి 15 మంది ప్రముఖులు, నటీనటుల పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. మరికొందరికి త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ కేసులో వారు నిందితులు కాదని, హవాలా కేసులో చెల్లింపులు ఎలా జరిగాయనే విషయమై వారిని విచారించనున్నట్లు సమాచారం.
Rekha Naik: నేడు బీఆర్ఎస్కు రేఖా నాయక్ రాజీనామా..! ఇండిపెండెంట్ గా పోటీ..?
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!