Telangana Murder: దృశ్యం-2 సినిమా చూసి అత్తను హత్య చేయించిన అల్లుడు
- దృశ్యం 2 స్ఫూర్తితో అత్త హత్య
- సిద్దిపేటలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్త హత్య
- సీసీ కెమెరాలతో బయటపడిన నిజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బు కోసం మనిషి ఏదైనా చేస్తాడు అని చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. తనకి వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆ నష్టాన్ని అత్తని హత్య చేసి నష్టం నుంచి బయటపడాలని దృశ్యం 2 సినిమా ప్లాన్ చేశాడో కసాయి అల్లుడు. ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించి, ఉన్న భూమి అత్త పేరుపై రాసి కొడుకు లెవెల్ లో బిల్డప్ ఇచ్చి చివరికి కాల యముడిలా మారాడు. అసలు ఈ ఘటన ఎలా బయటపడిందో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.
ఈ ఈనెల 7న సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మాసాన్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని రామమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. రామమ్మ అల్లుడు వెంకటేష్ 100 కి డయల్ చేసి విషయం చెప్పాడు.సమాచారం అందుకున్న పోలీసులు సాధారణ రోడ్డు ప్రమాదమని అనుకున్నారు. అయితే గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు అందులో మహేంద్ర థార్ వాహనం కనపడింది. అయితే ఆ వాహనమే మహిళని ఢీ కొట్టి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. TS 18 G 2277 నెంబర్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు తొగుట పోలీసులు. ఆ వాహనాన్ని సిద్దిపేటలో వెంకటేష్ కి సోదరుడి వరుస అయిన కరుణాకర్ తీసుకున్నట్టు తేలింది.ఈ క్రమంలో పోలీసులకు రామమ్మ అల్లుడుపై అనుమానం కలిగింది. వెంకటేష్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించారు తొగుట పోలీసులు.
Also Read
- Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
- Sowcar Janaki Health: సీనియర్ నటి 'షావుకారు' జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై చికిత్స!
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
Also Read:Mayasabha: వైఎస్-చంద్రబాబు స్నేహంపై సిరీస్.. టీజర్ రిలీజ్!
వెంకటేష్ ని రెండు సార్లు ఘటనపై ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని పోలీసులు అడగ్గా అలాంటిది ఏమి లేదని చెప్పాడు. అయితే కరుణాకర్ ఎవరిని పోలీసులు ప్రశ్నించగా వెంకటేష్ మాట తడబడింది. ఇక తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా అసలు నిజాలు బయటపెట్టాడు అల్లుడు వెంకటేష్. తన అత్త రామమ్మని తానే హత్య చేయించినట్టు ఒప్పుకున్నాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు. వెంటనే పోలీసులు తన సోదరుడైన కరుణాకర్ ని అదుపులోకి తీసుకుని పూర్తి సమాచారం రాబట్టారు. ఈ ఏడాది మార్చిలో వెంకటేష్ పౌల్ట్రీ ఫారం బిజినెస్, వ్యవసాయం చేసి 22 లక్షల రూపాయల వరకు నష్టపోయాడు. అలాగే కరుణాకర్ కి అప్పుగా 1.30 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు.
వ్యాపారంలో వచ్చిన నష్టం నుంచి బయట పడాలనుకున్నాడు వెంకటేష్. వికలాంగురాలైన తన అత్తని హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలని ప్లాన్ వేశాడు. తన అత్త రామమ్మ పేరుపై 60 లక్షల వరకు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టాడు. అలాగే ఆమె చనిపోతే మరో 5 లక్షల రూపాయలు రైతు భీమా వస్తాయని తన పేరుపై ఉన్న భూముని కూడా అత్త పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు అల్లుడు వెంకటేష్. ఓ రోజు తన సోదరుడు కరుణాకర్ ని పిలిచి తనకి ఇవ్వాల్సిన అప్పు ఇవ్వాలని అడగ్గా… కొద్దిగా సమయం కావాలని కోరాడు కరుణాకర్. వెంకటేష్ కరుణాకర్ కి ఓ ఆఫర్ ఇచ్చాడు తన అత్తని హత్య చేస్తే తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని అలాగే తన అత్త ఇన్సూరెన్స్ డబ్బులలో ఇద్దరు చేరి సగం పంచుకుందామని చెప్పడంతో కరుణాకర్ ఒకే చెప్పాడు.వెంటనే హత్యకు ప్లాన్ చేశారు.
Also Read:Shreya Dhanwanthary : ముద్దు సీన్ తీసేస్తారా.. సెన్సార్ బోర్డుపై నటి ఫైర్..
ఈ నెల 7న అల్లుడు వెంకటేష్ తన అత్త రామమ్మ దగ్గరకి వెళ్ళి బావి వద్ద విద్యుత్ అధికారులు వస్తున్నారని చెప్పారు. ఆమెని టివిఎస్ ఎక్సెల్ పై మాసాన్ పల్లి శివారు లో రోడ్డు వద్ద ఆపాడు. తాను అధికారులు వచ్చారో లేదో చూసి వస్తాను రోడ్డుపైనే ఉండాలని చెప్పడంతో సరే అంది రామమ్మ. వెంకటేష్ కొద్దిగా దూరం పోగానే కరుణాకర్ కి కాల్ చేశాడు. కరుణాకర్ థార్ వాహనంపై అతివేగంగా వచ్చి రామమ్మని ఢీ కొట్టి హత్య చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఏమి తెలియనట్టు వెంకటేష్ ఘటన స్థలానికి వచ్చి తన అత్తని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి చనిపోయిందని నమ్మించాడు. కానీ చివరికి పోలీసుల విచారణలో అల్లుడి బాగోతం బయటపడింది.
దృశ్యం 2 సినిమా చూసి హత్య చేసినట్టు విచారణలో ఇద్దరు నిందితులు ఒప్పుకున్నారు. అల్లుడి తెలివి చూసి పోలీసులే షాక్ అయ్యారు. సాంకేతికత ఆధారంగా కేసుని ఛేదించిన తొగుట పోలీసులను సిద్దిపేట సీపీ అనురాధ అభినందించారు. మొత్తానికి అత్తని హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేద్దామన్న అల్లుడి ప్లాన్ బెడిసికొట్టింది. సిసి కెమెరాలు ఈ కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించాయి.
- Tags
తాజావార్తలు
-
Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
Economic D-Day: ఇరాన్కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!