Betting Apps Case: హర్ష సాయి, టేస్టీ తేజపై గంటల పాటు సీఐడీ విచారణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెట్టింగ్ మరియు గేమింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి, బిగ్ బాస్ ఫేమ్ మరియు ఫుడ్ బ్లాగర్ టేస్టీ తేజ సీఐడీ విచారణను ఎదుర్కొన్నారు. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు నమోదు అయిన తర్వాత హర్ష సాయి విదేశాలకు పారిపోయినట్లు సమాచారం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులోనూ విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టిన హర్ష సాయిని, తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని సీఐడీ హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో, మూడు రోజుల క్రితం హర్ష సాయి సీఐడీ విచారణకు హాజరయ్యారు. సీఐడీ అధికారులు అతన్ని నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.
Also Read :12A Railway Colony Review: ’12ఏ రైల్వే కాలనీ’ రివ్యూ
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
బిగ్ బాస్ ఫేమ్, ఫుడ్ బ్లాగర్ టేస్టీ తేజ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. పలు బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లను తేజ ప్రమోట్ చేసినట్లు సీఐడీ గుర్తించింది. ముఖ్యంగా, తను చేసే ఫుడ్ బ్లాగ్ వీడియోల్లో కూడా బెట్టింగ్, గేమింగ్ యాప్లకు సంబంధించిన ప్రకటనలు ఇచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. ఏయే యాప్లకు ఎంత మొత్తంలో డబ్బులు తీసుకుని ప్రచారం చేశారనే వివరాలపై అధికారులు తేజను ప్రశ్నించారు. టేస్టీ తేజను సీఐడీ అధికారులు రెండు గంటలపాటు విచారించారు. బెట్టింగ్ యాప్ల ద్వారా జరుగుతున్న ఆర్థిక మోసాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రమోషన్లలో పాల్గొన్న మరికొంత మంది ప్రముఖులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!