మెగాభిమానులకు చిరంజీవి స్పెషల్ థ్యాంక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా క్రైసిస్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేవలందించిన సంగతి తెలిసిందే. ఈ సేవల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్రతినిధులు పాలుపంచుకున్నారు. అందుకే ఆదివారం రోజు తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజన్ సేవల్లో పాల్గొన్న ప్రతినిధుల్ని పిలిచి మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.
ఈ వేదికపై అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు మహేష్ చింతామణి మరియు రమణం స్వామినాయుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల నిర్వాహకులు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు మహేష్ చింతామణి మాట్లాడుతూ “కరోనా కష్ట కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్ని కాపాడేందుకు చిరంజీవి గారు ఆక్సిజన్ సిలిండర్స్ సరఫరా కార్యక్రమం చేశారు. అభిమానుల ద్వారానే ఇవి సరఫరా అయ్యాయి.
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
తాజాగా తెలంగాణ జిల్లాల నుంచి అభిమానులందరినీ పిలిచి చిరంజీవి గారు అభినందించారు. వీరు చేసిన సేవల్ని కొనియాడి సైనికులుగా అభివర్ణించారు. నా కోసం ప్రాణాలిస్తానని అనే అభిమానులు మీరే ప్రాణాల్ని కాపాడినందుకు అభినందిస్తున్నానని రాబోవు కాలంలో పేదలను ఆదుకునేందుకు అభిమానుల సహకారం కావాలని చిరంజీవి గారు కోరారు. అభిమానులంతా మెగాస్టార్ కు అండగా నిలుస్తామని ప్రమాణం చేశారు. తెలంగాణ అన్ని జిల్లాల నుంచి కర్నాటక – ఒరిస్సా నుంచి చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులు విచ్చేశారు“ అని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-కరోనా కష్టకాలంలో నా అభిమానుల్ని కోల్పోయి చాలా ఆవేదన చెందాను. కరోనా భారిన పడి దురదృష్ట వశాత్తు.. ప్రసాద్ - హిందూపురం.. ఎర్రా నాగబాబు- అంబాజీపేట. రవి - కడప వీరందరినీ కోల్పోయాను. కరోనా పొట్టన పెట్టుకుని విషాదాన్ని మిగిల్చింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని అన్నారు. కరోనా విలయం ఎంతో మార్చేసింది. ఇక ఈ కష్ట కాలంలో తాను అండగా నిలుస్తానని నా స్నేహితుడు శేఖర్ ముందుకొచ్చారు. తన విరామ సమయాన్ని సేవా కార్యక్రమాలకు అంకితమిస్తానని అన్నారు. అతడిని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా నియమించాం. స్వామినాయుడు కూడా అతనితో కలిసి పని చేస్తాడు. చెన్నైలో తన కెరీర్ సాగుతున్నప్పటి నుంచి శేఖర్ తనకు స్నేహితుడు అని ఒక అభిమానిగా వెన్నుదన్నుగా నిలిచాడని చిరంజీవి తెలిపారు.
- Tags
- Chiranjeevi
- Covid19
- mega fans
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం