30 కోట్ల నుంచీ 400 కోట్ల దాకా… బాలీవుడ్ కు బంపర్ ఆఫర్స్ ఇస్తోన్న ఓటీటీలు!
సినిమా అంటే థియేటర్ కి వెళ్లాలి. బాక్సాఫీస్ వద్ద టికెట్ కొనాలి. పాప్ కార్న్ తింటూ చూడాలి. పెద్ద తెరపై చూసిన దాని గురించి పెద్ద డిస్కషన్ చేస్తూ ఇంటికి తిరిగి రావాలి. ఇదంతా ఒకప్పుడు. కరోనా దెబ్బతో ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అన్నట్టుగా మారింది సీన్! లాక్ డౌన్స్ వల్ల థియేటర్లు మూతపడుతూ, తెరుచుకుంటూ గందరగోళంగా ఉండటంతో… ఓటీటీలు పండగ చేసుకుంటున్నాయి. పెద్ద నిర్మాతలకే పెద్ద పెద్ద ఆఫర్లు ఇస్తున్నాయి! కాదనలేని రేటు చెప్పి కలకలం సృష్టిస్తున్నాయి!
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తోన్న తొలి ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’! ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏకంగా 200 కోట్లు ఇస్తామంటోందట, అన్ని రకాల రైట్స్ ని కలుపుకుని! ప్యాండమిక్ కాలంలో ఈ ఆఫర్ నిజంగా తీవ్రంగా ఆలోచింపజేసేదే!
Also Read
- Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?
- Chandrababu - Pawan: సర్జరీ అయిన పవన్'ను పరామర్శించిన చంద్రబాబు
- Police Complaint: సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్!
- JD Chakravarthy: "సాయంత్రం 7:30 దాటితే చాలు.. నాకు బయటి ప్రపంచంతో పనే లేదు".. జేడీ చక్రవర్తి
Read Also : “హీరో” రికార్డులు మొదలయ్యాయి…!?
మన తెలుగు స్టార్ హీరో నటించిన మరో ప్యాన్ ఇండియా చిత్రం ‘రాధే శ్యామ్’. ‘బాహుబలి’ ప్రభాస్ ఉండటంతో దీనిపై చాలా అంచనాలున్నాయి. అయితే, 350 కోట్ల వరకూ బడ్జెట్ అంచనాలున్న ఈ సినిమాకి 400 కోట్లు ఇస్తామంటున్నారట! పెద్ద జ్యూసీ ఆఫర్ కాకపోయినా ప్యాండమిక్ టైంలో ప్యాన్ ఇండియా మూవీకి 400 కోట్లు సేఫ్ అమౌంటే అంటున్నారు ఎక్స్ పర్ట్స్!
‘లైగర్, రాదేశ్యామ్’ ఇంత వరకూ ఓటీటీ రిలీజ్ ని కన్ ఫర్మ్ చేయలేదు. కానీ, అజయ్ దేవగణ్ ‘భుజ్’ సినిమా 112 కోట్లకు ఆల్రెడీ అమ్ముడుపోయింది. డిస్నీ హాట్ స్టార్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్ట్రీమింగ్ అవ్వొచ్చంటున్నారు. అజయ్, సోనాక్షి, ప్రణీత నటించిన వార్ యాక్షన్ ఫిల్మ్ ‘భుజ్’పై భారీ అంచనాలే ఉన్నాయి.
Read Also : బీస్ట్ మోడ్ లో అక్కినేని హీరో వర్కౌట్లు…!
కార్తీక్ ఆర్యన్ ‘ధమాకా’ సినిమా 85 కోట్ల భారీ డీల్ కుదుర్చుకుంది నెట్ ఫ్లిక్స్ తో. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. సైఫ్, అర్జున్ కపూర్, జాక్వలిన్, యమీ గౌతమ్ నటించిన ‘భూత్ పోలీస్’ 45 కోట్లకు ఓటీటీ వేదిక మీదకి చేరింది. ఈ సినిమా కూడా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలియదుగానీ… ‘భూత్ పొలీస్’ నిర్మాత పబ్లిక్ గానే తాను ఓటీటీ ఆఫర్ తో లాభపడ్డట్టు అంగీకరించాడు!
సౌత్ డైరెక్టర్ ప్రియదర్శన్ బాలీవుడ్ మూవీ ‘హంగామా 2’ కూడా 30 కోట్ల ధర పలికింది. డిస్నీ హాట్ స్టార్ ఈ కామెడీ సీక్వెల్ ని స్వంతం చేసుకుంది. సీనియర్ నటులు పరేశ్ రావల్, శిల్పా శెట్టితో పాటూ యంగ్ కపుల్ మీజాన్ జాఫ్రీ, ప్రణీత సుభాష్ కూడా ఈ సినిమాలో ఉన్నారు.
తాజావార్తలు
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
-
KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!