Bollywood: ఇండియన్ స్క్రీన్ పై మరోసారి ‘రామాయణం’.. రాముడు ఎవరంటె.?
- మరోసారి ఇండియన్ తెరపై రామాయణం
- రామునిగా బాలీవుడ్ నటుడు రణ్బీర్కపూర్
- నితేశ్ తివారి దర్శకత్వంలో రానున్న భారీ చిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ఇతిహాసాల నేపథ్యంలో ఇతిహాసాల నేపథ్యంలో సాగే కథలను తెరకెక్కించేందుకు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. మొన్న ఆ మధ్య వచ్చిన ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర, రీసెంట్ సూపర్ సెన్సేషన్ రెబల్ స్టార్ కల్కి భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కినవే. తాజాగా మరోసారి రామాయణాన్ని ఇండియన్ తెరపై చూపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రణ్బీర్కపూర్ హీరోగా బాలీవుడ్ లో ‘రామాయణ’ అనే చిత్రం రానుంది. గతంలో వచ్చిన బ్రహ్మాస్త్ర తో భారీ హిట్ కొట్టిన రణ్బీర్ ఈ దఫా రాముని పాత్రలో కనిపించనున్నాడు. టాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అద్భుతమైన నటనను కనబరిచిన సాయి పల్లవి ‘రామాయణ’ చిత్రంలో సీతగా కనిపించనుంది. పదితలల రావణాసురుడిగా కన్నడ స్టార్ హీరో యష్ నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ ‘రామాయణ’కు దర్శకత్వం వహిస్తున్నాడు.
కాగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం కోసం ఏకంగా 12 సెట్లు నిర్మించనున్నారు మేకర్స్. రామాయణంలోని అత్యంత కీలకమైన అయోధ్య, మిథిలా పట్టణాలను కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ఖర్చుకు వెనుకాడక డిజైన్ చేస్తున్నారు. ముంబయిలో 3-D ఫార్మేట్ లో భారీ సెట్స్ నిర్మించనున్నారు. ‘రామాయణ’ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నాడు దర్శకుడు నితేశ్ తివారి. షూటింగ్ చక చక ముగించి VFX పనులను కంప్లిట్ చేసి మొదటి భాగాన్ని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇండియన్ హిస్టరీలో భారీ బడ్జెట్ లో రానున్న ఈ చిత్రాన్ని రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read
Also Read: Ustad: డబుల్ ఇస్మార్ట్ ను డబుల్ స్పీడ్ లో ముగించిన రామ్ పోతినేని
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!