Bollywood: ఇండియన్ స్క్రీన్ పై మరోసారి ‘రామాయణం’.. రాముడు ఎవరంటె.?
- మరోసారి ఇండియన్ తెరపై రామాయణం
- రామునిగా బాలీవుడ్ నటుడు రణ్బీర్కపూర్
- నితేశ్ తివారి దర్శకత్వంలో రానున్న భారీ చిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ఇతిహాసాల నేపథ్యంలో ఇతిహాసాల నేపథ్యంలో సాగే కథలను తెరకెక్కించేందుకు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. మొన్న ఆ మధ్య వచ్చిన ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర, రీసెంట్ సూపర్ సెన్సేషన్ రెబల్ స్టార్ కల్కి భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కినవే. తాజాగా మరోసారి రామాయణాన్ని ఇండియన్ తెరపై చూపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రణ్బీర్కపూర్ హీరోగా బాలీవుడ్ లో ‘రామాయణ’ అనే చిత్రం రానుంది. గతంలో వచ్చిన బ్రహ్మాస్త్ర తో భారీ హిట్ కొట్టిన రణ్బీర్ ఈ దఫా రాముని పాత్రలో కనిపించనున్నాడు. టాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అద్భుతమైన నటనను కనబరిచిన సాయి పల్లవి ‘రామాయణ’ చిత్రంలో సీతగా కనిపించనుంది. పదితలల రావణాసురుడిగా కన్నడ స్టార్ హీరో యష్ నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ ‘రామాయణ’కు దర్శకత్వం వహిస్తున్నాడు.
కాగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం కోసం ఏకంగా 12 సెట్లు నిర్మించనున్నారు మేకర్స్. రామాయణంలోని అత్యంత కీలకమైన అయోధ్య, మిథిలా పట్టణాలను కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ఖర్చుకు వెనుకాడక డిజైన్ చేస్తున్నారు. ముంబయిలో 3-D ఫార్మేట్ లో భారీ సెట్స్ నిర్మించనున్నారు. ‘రామాయణ’ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నాడు దర్శకుడు నితేశ్ తివారి. షూటింగ్ చక చక ముగించి VFX పనులను కంప్లిట్ చేసి మొదటి భాగాన్ని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇండియన్ హిస్టరీలో భారీ బడ్జెట్ లో రానున్న ఈ చిత్రాన్ని రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read
Also Read: Ustad: డబుల్ ఇస్మార్ట్ ను డబుల్ స్పీడ్ లో ముగించిన రామ్ పోతినేని
తాజావార్తలు
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!