Tollywood: మంత్రితో నిర్మాతల సమావేశంలో ట్విస్ట్
- ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో 14 మంది ప్రముఖ నిర్మాతలు సమావేశం
- సినీ పరిశ్రమ అభివృద్ధి, స్టూడియో నిర్మాణం, టికెట్ ధరలపై చర్చ
- కార్మిక సమస్యలు ప్రస్తావన రాలేదు : విశ్వ ప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు 14 మంది సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో నిర్మాతలు మంత్రి కందుల దుర్గేష్కు పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న సమస్యలు, సవాళ్లు మరియు తాజా పరిణామాల గురించి వివరించారు. ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె, కార్మికుల వేతనాల సమస్యలు, షూటింగ్ల నిలిచిపోవడం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అలాగే, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన కొత్త విధానాలు, స్టూడియోల నిర్మాణం, టికెట్ ధరల నియంత్రణ వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
Also Read : Tollywood: మీడియా ముందుకు వర్ధమాన నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?
Also Read
- Pavala Shyamala: శ్యామల ఎలా 'పావలా శ్యామల' అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
- Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
- MM Keeravani: బాబు సినిమా కోసం ఇంత టైమ్ ఎందుకు స్వామి?.. 'వారణాసి' రీ రికార్డింగ్పై కీరవాణి కీలక నిర్ణయం!
- Objection My Lord : మెగాస్టార్ ప్రశంసలతో ఉప్పొంగిపోతున్న 'అబ్జెక్షన్ మై లార్డ్' టీమ్..
సమావేశంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాతలలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, డి.వి.వి. దానయ్య, కె.ఎల్. నారాయణ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్, నాగ వంశీ, యెర్నేని రవిశంకర్, విశ్వ ప్రసాద్, బన్నీ వాసు, యూవీ క్రియేషన్స్ వంశీ, మైత్రీ మూవీ మేకర్స్ చెర్రీ, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి ఉన్నారు. ఈ బృందం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏపీ సచివాలయానికి వెళ్లారు. ఈ భేటీ నేపథ్యంలో, గత కొన్ని రోజులుగా కార్మికుల 30 శాతం వేతన పెంపు డిమాండ్తో టాలీవుడ్లో నెలకొన్న బంద్ వాతావరణం కీలక అంశంగా మారింది. అయితే ఈ భేటీ అనంతరం నిర్మాత విశ్వప్రసాద్ మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడుతూ అసలు మంత్రితో భేటీలో కార్మికుల సమస్య గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని వెల్లడించారు. కేవలం సినీ పరిశ్రమ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి మాత్రమే చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు. మరో నిర్మాత మైత్రీ రవిశంకర్ మాట్లాడుతూ ఏపీ సీఎం అపాయింట్మెంట్ కోసమే అడిగేందుకు వచ్చామని అన్నారు. ఎప్పుడో కలవాల్సి ఉందని , ఆలస్యం అవుతూ ఉండడంతో కలిసేందుకు వచ్చామని అన్నారు.
తాజావార్తలు
-
Pavala Shyamala: శ్యామల ఎలా ‘పావలా శ్యామల’ అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
-
KTR : హైడ్రా సంస్కరణ కాదు.. అరాచక సంస్థ.. కేటీఆర్ ఫైర్
-
Tollywood: వరుస గాయాలతో రెస్ట్ మోడ్ లోకి టాలీవుడ్ హీరోలు!
-
Trump-Netanyahu: ట్రంప్-నెతన్యాహు విభేదాలు.. దేనికోసమంటే..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
ట్రెండింగ్
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!