Tollywood: మంత్రితో నిర్మాతల సమావేశంలో ట్విస్ట్
- ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో 14 మంది ప్రముఖ నిర్మాతలు సమావేశం
- సినీ పరిశ్రమ అభివృద్ధి, స్టూడియో నిర్మాణం, టికెట్ ధరలపై చర్చ
- కార్మిక సమస్యలు ప్రస్తావన రాలేదు : విశ్వ ప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు 14 మంది సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో నిర్మాతలు మంత్రి కందుల దుర్గేష్కు పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న సమస్యలు, సవాళ్లు మరియు తాజా పరిణామాల గురించి వివరించారు. ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె, కార్మికుల వేతనాల సమస్యలు, షూటింగ్ల నిలిచిపోవడం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అలాగే, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన కొత్త విధానాలు, స్టూడియోల నిర్మాణం, టికెట్ ధరల నియంత్రణ వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
Also Read : Tollywood: మీడియా ముందుకు వర్ధమాన నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?
Also Read
సమావేశంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాతలలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, డి.వి.వి. దానయ్య, కె.ఎల్. నారాయణ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్, నాగ వంశీ, యెర్నేని రవిశంకర్, విశ్వ ప్రసాద్, బన్నీ వాసు, యూవీ క్రియేషన్స్ వంశీ, మైత్రీ మూవీ మేకర్స్ చెర్రీ, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి ఉన్నారు. ఈ బృందం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏపీ సచివాలయానికి వెళ్లారు. ఈ భేటీ నేపథ్యంలో, గత కొన్ని రోజులుగా కార్మికుల 30 శాతం వేతన పెంపు డిమాండ్తో టాలీవుడ్లో నెలకొన్న బంద్ వాతావరణం కీలక అంశంగా మారింది. అయితే ఈ భేటీ అనంతరం నిర్మాత విశ్వప్రసాద్ మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడుతూ అసలు మంత్రితో భేటీలో కార్మికుల సమస్య గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని వెల్లడించారు. కేవలం సినీ పరిశ్రమ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి మాత్రమే చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు. మరో నిర్మాత మైత్రీ రవిశంకర్ మాట్లాడుతూ ఏపీ సీఎం అపాయింట్మెంట్ కోసమే అడిగేందుకు వచ్చామని అన్నారు. ఎప్పుడో కలవాల్సి ఉందని , ఆలస్యం అవుతూ ఉండడంతో కలిసేందుకు వచ్చామని అన్నారు.
తాజావార్తలు
-
Keeway Hypvolt-R: భారత్లోకి కీవే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రీమియం ఫీచర్లు, 180KM రేంజ్
-
Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Anand Deverakonda: ఆ స్టార్ హీరోయిన్పై క్రష్.. ఆనంద్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!