గోపీచంద్ కి ఇలాంటి ఫంక్షన్లకు రావడం అలవాటు లేదు .. ఇష్టం లేదని, అతని సిగ్గు అంటూ అల్లు అరవింద్ అన్నారు. ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రెస్ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. “ఈ సినిమా కథను మారుతి వినిపించగానే టైటిల్ ఏది అనుకుంటున్నావ్? అని అడిగితే ‘పక్కా కమర్షియలేయ్’ అన్నాడు. మారుతి దగ్గరున్న ప్రత్యేకతనే అది. ఈ సినిమాతో రెండున్నర గంటల పాటు నవ్విస్తూనే .. ఒక మెసేజ్ ఇచ్చి హాయిగా బయటికి పంపిస్తాడు. ఎప్పుడైనా సరే మారుతి సినిమాను థియేటర్లోనే చూడాలి.. అప్పుడే బాగా ఎంజాయ్ చేయగలుగుతామంటూ మాట్లాడారు.
ఇక గోపీచంద్ గురించి మాట్లాడుతూ.. ఇలాంటి ఫంక్షన్లకు రావడం గోపీచంద్ కి అలవాటు లేదని, ఇష్టం లేదు .. అతను సిగ్గు పడతాడని అన్నారు. ఈ సారి గోపీచంద్ ను రప్పించాలనే అనుకున్నామని స్టేజ్ పై నవ్వులు పూయించారు. ఈ సినిమాలో హీరోయిన్ రాశి ఖన్నా అని నేను మారుతి కంటే ఎక్కువ ఫిక్స్ అయ్యాను. ఆమె పాత్ర అంత యెటకారంగా .. వేళాకోళంగా ఉంటుందని అన్నారు. మారుతికి .. మాకు మధ్య మంచి అనుబంధం ఉంది. మా బ్యానర్లో చేయడం ఆయనకి ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. మారుతి ఈ సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టించాడు. లాభం రాకపోతే తరువాత సినిమా రెమ్యునరేషన్ లో కోత ఉంటుందని అన్నారు.
ఈ స్టేజ్ పైనే అంతా మాట్లడేస్తున్నారు.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లేదా అని అనుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇంకా నాలుగు ఫంక్షన్లు ఉన్నాయి. ఈ నాలుగు ఫంక్షన్లలో ఏమేం మాట్లాడాలో డిసైడ్ అయ్యానంటూ అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇక గోపీచంద్ – రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన పక్కా కమర్షియల్ సినిమా ప్రేక్షలు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.
