Allu Arjun: మరణించిన మహిళ కుటుంబానికి 25 లక్షలు ప్రకటించిన అల్లు అర్జున్
- సంధ్య థియేటర్ కి సినిమా చూసేందుకు వెళ్లాను
- సినిమా చూసి వచ్చిన తరువాత మహిళా చనిపోయారు, బాబుకి సీరియస్ అని తెలిసింది
- నేను, సుకుమార్, టీమ్ అంతా చాలా బాధ పడ్డాము
- మేము ఏం చేసినా ఆ లోటును భర్తీ చెయ్యలేను
- కానీ అన్నిటికీ మేము మీతో ఉంటాము
- 25 లక్షలు వారి ఫ్యూచర్ కోసం ఇస్తున్నాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్లో ఏర్పడిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ఇప్పటికే సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. తాజాగా ఈ విషయం మీద స్పందిస్తూ అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ట్విట్టర్ వేదిక వీడియో రిలీజ్ చేసిన ఆయన సంధ్య థియేటర్లో జరిగిన దారుణ ఘటన తనకు తీవ్రమైన మనోవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ కఠినమైన సమయంలో తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్న అని చెప్పుకొచ్చారు. నేను త్వరలోనే ఆ కుటుంబాన్ని కలుస్తాను వారు ఈ బాధను ఒంటరిగా అనుభవించడం తనకి ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. వాళ్లకు వీలైనంత సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అని పేర్కొన్నారు. మొన్న మేము పుష్ప సినిమా ప్రీమియర్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా జనాలు ఎక్కువగా రావడం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏమిటంటే ఒక మహిళ మృతి చెందింది.
Delhi: ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు.. నిందితుడి మొబైల్లో ఏమున్నాయంటే..!
Also Read
- Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
- Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
- ‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
- Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
అలాగే కుటుంబ సభ్యుల్లో కొందరికి దెబ్బలు తగిలినట్టు తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు మేమందరం టీం ఆఫ్ పుష్ప అందరూ డిసప్పాయింట్ అయి ఒక షాక్ లోకి వెళ్ళాము. ఎందుకంటే ఇది ఎవరూ ఊహించనిది. ప్రతి పెద్ద సినిమాకి మెయిన్ థియేటర్ కి వెళ్లి సినిమా చూసి రావడం అనేది ఒక ఆనవాయితీ. ఇన్నేళ్లుగా ఎప్పుడూ జరగనిది ఇప్పుడు సడన్గా జరగడంతో మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఈ వార్త తెలిసిన తర్వాత మేము పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. మేము సినిమా తీసేదే జనాలు థియేటర్లోకి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పటికీ మాటల్లో చెప్పలేని బాధ కలిగింది. రేవతి గారి ఫ్యామిలీ మొత్తానికి నా తరఫున సంతాపం అలాగే నా పుష్ప టీం మొత్తం తరపున సంతాపం తెలియజేస్తున్నాను. మేమేం చేసినా ఎంత మాట్లాడినా మీకు కలిగిన నష్టాన్ని మేము భర్తీ చేయలేము అంటూ ఆయన మాట్లాడారు. అయితే ఒక గుడ్ విల్ గెస్చర్ గా 25 లక్షలు వారి ఫ్యూచర్ కోసం ఇస్తున్నా, ఈ 25 లక్షలకి సంభంధం లేకుండా మెడికల్ ఖర్చులు భరిస్తా అలాగే ఫ్యామిలీ భాద్యత నాదేనని అన్నారు. సినిమా చూసి ఇంటికి సేఫ్ గా వెళ్లండని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..