Allu Arjun: మరణించిన మహిళ కుటుంబానికి 25 లక్షలు ప్రకటించిన అల్లు అర్జున్
- సంధ్య థియేటర్ కి సినిమా చూసేందుకు వెళ్లాను
- సినిమా చూసి వచ్చిన తరువాత మహిళా చనిపోయారు, బాబుకి సీరియస్ అని తెలిసింది
- నేను, సుకుమార్, టీమ్ అంతా చాలా బాధ పడ్డాము
- మేము ఏం చేసినా ఆ లోటును భర్తీ చెయ్యలేను
- కానీ అన్నిటికీ మేము మీతో ఉంటాము
- 25 లక్షలు వారి ఫ్యూచర్ కోసం ఇస్తున్నాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్లో ఏర్పడిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ఇప్పటికే సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. తాజాగా ఈ విషయం మీద స్పందిస్తూ అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ట్విట్టర్ వేదిక వీడియో రిలీజ్ చేసిన ఆయన సంధ్య థియేటర్లో జరిగిన దారుణ ఘటన తనకు తీవ్రమైన మనోవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ కఠినమైన సమయంలో తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్న అని చెప్పుకొచ్చారు. నేను త్వరలోనే ఆ కుటుంబాన్ని కలుస్తాను వారు ఈ బాధను ఒంటరిగా అనుభవించడం తనకి ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. వాళ్లకు వీలైనంత సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అని పేర్కొన్నారు. మొన్న మేము పుష్ప సినిమా ప్రీమియర్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా జనాలు ఎక్కువగా రావడం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏమిటంటే ఒక మహిళ మృతి చెందింది.
Delhi: ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు.. నిందితుడి మొబైల్లో ఏమున్నాయంటే..!
Also Read
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
- Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
అలాగే కుటుంబ సభ్యుల్లో కొందరికి దెబ్బలు తగిలినట్టు తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు మేమందరం టీం ఆఫ్ పుష్ప అందరూ డిసప్పాయింట్ అయి ఒక షాక్ లోకి వెళ్ళాము. ఎందుకంటే ఇది ఎవరూ ఊహించనిది. ప్రతి పెద్ద సినిమాకి మెయిన్ థియేటర్ కి వెళ్లి సినిమా చూసి రావడం అనేది ఒక ఆనవాయితీ. ఇన్నేళ్లుగా ఎప్పుడూ జరగనిది ఇప్పుడు సడన్గా జరగడంతో మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఈ వార్త తెలిసిన తర్వాత మేము పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. మేము సినిమా తీసేదే జనాలు థియేటర్లోకి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పటికీ మాటల్లో చెప్పలేని బాధ కలిగింది. రేవతి గారి ఫ్యామిలీ మొత్తానికి నా తరఫున సంతాపం అలాగే నా పుష్ప టీం మొత్తం తరపున సంతాపం తెలియజేస్తున్నాను. మేమేం చేసినా ఎంత మాట్లాడినా మీకు కలిగిన నష్టాన్ని మేము భర్తీ చేయలేము అంటూ ఆయన మాట్లాడారు. అయితే ఒక గుడ్ విల్ గెస్చర్ గా 25 లక్షలు వారి ఫ్యూచర్ కోసం ఇస్తున్నా, ఈ 25 లక్షలకి సంభంధం లేకుండా మెడికల్ ఖర్చులు భరిస్తా అలాగే ఫ్యామిలీ భాద్యత నాదేనని అన్నారు. సినిమా చూసి ఇంటికి సేఫ్ గా వెళ్లండని ఆయన కోరారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
-
Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!