Delhi: ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు.. నిందితుడి మొబైల్లో ఏమున్నాయంటే..!
- ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు
- హత్య చేసేందుకు మొబైల్లో సర్చ్
- నిందితుడు రాజేష్ మంచోడేనన్న బంధువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం రోజే.. కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన చెల్లెలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.
దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలోని డియోలీలో ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు బుధవారం (నవంబర్ 4) ఉదయం హత్యకు గురయ్యారు. మృతులు భర్త రాజేష్ (55), భార్య కోమల్ (47), కూతురు కవిత (23)గా పోలీసులు గుర్తించారు. ఉదయం మార్నింగ్ వాకింగ్ వెళ్లొచ్చేటప్పటికీ చనిపోయి ఉన్నారని కుమారుడు రాజేష్ పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా అజ్ఞాత వ్యక్తులు వచ్చినట్లు కనబడలేదు. దీంతో రాజేష్పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లుగా ఒప్పుకున్నాడు.
Also Read
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
ఇది కూడా చదవండి: Lip Care Tips: చలికాలంలో పెదవులు పగులుతున్నాయా..? మృదువైన పెదాల కోసం ఇలా చేయండి
నిందితుడు రాజేష్ను కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబ సభ్యుల్ని హత్య చేసేందుకు మొబైల్లో వెబ్ స్టోరీలు చూసినట్లుగా కనుగొన్నారు. అంతేకాకుండా ఏ విధంగా హత్య చేయాలో అన్నదానిపై అనేక కోణాలను అన్వేషించినట్లుగా గుర్తించారు. విష ప్రయోగం ద్వారా కూడా చంపేందుకు సర్చ్ చేశాడు. కానీ ఇవన్నీ కుదరకపోవడంతో తండ్రికి సంబంధించిన ఆర్మీ కత్తిని తీసుకుని ముగ్గురిని చంపేశాడు. మొదటిగా సోదరిపై దాడి చేశాడు. చెయ్యి అడ్డుపెడితే విరిగిపోయింది. దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసినా.. దాడి చేస్తూనే ఉన్నాడు. ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం అంతస్తు పైకి వెళ్లి తండ్రిపై దాడి చేశాడు.. అనంతరం తల్లిపై దాడి చేసి ముగ్గురి ప్రాణాలు తీశాడు.
ఇదిలా ఉంటే కుటుంబ సభ్యులతో రాజేష్కు ఎలాంటి విభేదాలు లేవని బంధువులు తెలిపారు. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని.. అందరూ బాగానే ఉంటారని చెప్పుకొచ్చారు. కుమారుడికి హై-ఎండ్ మోటార్ సైకిల్ కొనిచ్చాడని బంధువు తెలిపారు. అంతేకాకుండా జిమ్కు అవసరమైన వస్తువులతో పాటు మంచి ఆహారం కూడా తండ్రి అందిస్తున్నాడని వెల్లడించారు. అయితే సోదరిని మాత్రం చంపేస్తానంటూ పలుమార్లు బెదిరించేవాడని స్థానికులు తెలిపారు. సరాదాగా అంటున్నాడేమో అనుకున్నామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Basil Joesph : డైరెక్షన్ వద్దు.. యాక్టింగే ముద్దు
తాజావార్తలు
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్కు కౌంట్డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!