Delhi: ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు.. నిందితుడి మొబైల్లో ఏమున్నాయంటే..!
- ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు
- హత్య చేసేందుకు మొబైల్లో సర్చ్
- నిందితుడు రాజేష్ మంచోడేనన్న బంధువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం రోజే.. కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన చెల్లెలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.
దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలోని డియోలీలో ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు బుధవారం (నవంబర్ 4) ఉదయం హత్యకు గురయ్యారు. మృతులు భర్త రాజేష్ (55), భార్య కోమల్ (47), కూతురు కవిత (23)గా పోలీసులు గుర్తించారు. ఉదయం మార్నింగ్ వాకింగ్ వెళ్లొచ్చేటప్పటికీ చనిపోయి ఉన్నారని కుమారుడు రాజేష్ పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా అజ్ఞాత వ్యక్తులు వచ్చినట్లు కనబడలేదు. దీంతో రాజేష్పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లుగా ఒప్పుకున్నాడు.
Also Read
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
ఇది కూడా చదవండి: Lip Care Tips: చలికాలంలో పెదవులు పగులుతున్నాయా..? మృదువైన పెదాల కోసం ఇలా చేయండి
నిందితుడు రాజేష్ను కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబ సభ్యుల్ని హత్య చేసేందుకు మొబైల్లో వెబ్ స్టోరీలు చూసినట్లుగా కనుగొన్నారు. అంతేకాకుండా ఏ విధంగా హత్య చేయాలో అన్నదానిపై అనేక కోణాలను అన్వేషించినట్లుగా గుర్తించారు. విష ప్రయోగం ద్వారా కూడా చంపేందుకు సర్చ్ చేశాడు. కానీ ఇవన్నీ కుదరకపోవడంతో తండ్రికి సంబంధించిన ఆర్మీ కత్తిని తీసుకుని ముగ్గురిని చంపేశాడు. మొదటిగా సోదరిపై దాడి చేశాడు. చెయ్యి అడ్డుపెడితే విరిగిపోయింది. దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసినా.. దాడి చేస్తూనే ఉన్నాడు. ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం అంతస్తు పైకి వెళ్లి తండ్రిపై దాడి చేశాడు.. అనంతరం తల్లిపై దాడి చేసి ముగ్గురి ప్రాణాలు తీశాడు.
ఇదిలా ఉంటే కుటుంబ సభ్యులతో రాజేష్కు ఎలాంటి విభేదాలు లేవని బంధువులు తెలిపారు. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని.. అందరూ బాగానే ఉంటారని చెప్పుకొచ్చారు. కుమారుడికి హై-ఎండ్ మోటార్ సైకిల్ కొనిచ్చాడని బంధువు తెలిపారు. అంతేకాకుండా జిమ్కు అవసరమైన వస్తువులతో పాటు మంచి ఆహారం కూడా తండ్రి అందిస్తున్నాడని వెల్లడించారు. అయితే సోదరిని మాత్రం చంపేస్తానంటూ పలుమార్లు బెదిరించేవాడని స్థానికులు తెలిపారు. సరాదాగా అంటున్నాడేమో అనుకున్నామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Basil Joesph : డైరెక్షన్ వద్దు.. యాక్టింగే ముద్దు
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!