పుష్ప -2 రిలీజ్ రోజు న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో శ్రీతేజ్ గాయపడిన సంగతి తెలిసిందే. చాలా నెలలుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శ్రీతేజ్ కొద్దీ రోజుల క్రితం ఆసుపత్రి నుండి డిశార్చి అయ్యాడు. అయితే శ్రీతేజ్ పూర్తిగా కోలుకునేందుకు మరి కొన్ని నెలలు పడుతుందని డాక్టర్స్ వెల్లడించారు. అదే సమయంలో శ్రీతేజ్ ను రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు. నేడు శ్రీతేజ్ ను పరామర్శించారు అల్లు అరవింద్. రీహాబ్ కు వెళ్లి డాక్టర్లను కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు అరవింద్. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘శ్రీ తేజ్ కోలుకోవటం కోసం మా కుటుంబం అంతా ఎదురుచూస్తోంది. శ్రీతేజ్ రోజురోజుకు కోలుకుంటున్న విషయం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. శ్రీ తేజ్ చికిత్సకు సహకరిస్తున్నారు అని చెప్పారు డాక్టర్లు. ఇప్పటికే రూ. 2 కోట్లు శ్రీతేజ్ అకౌంట్ లో డిపాజిట్ చేసాడు అల్లు అర్జున్. త్వరలోనే శ్రీ తేజ్ మనందరి మధ్య సాధారణల పిల్లల్లా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను’ అని అన్నారు.