Rashmika Mandanna: నాకు యాక్టింగ్ రాదన్నారు.. గద్దర్ సినీ పురస్కారాల్లో రష్మిక ఎమోషనల్!
- తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 వేడుక
- వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నేషనల్ క్రష్ రష్మిక
- తెలంగాణ కోడలిని అంటూ రష్మిక కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Calls Herself Telangana Kodalu at Gaddar Awards 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ సినీ పురస్కారాలు వరుసగా రెండో ఏడాది ఘనంగా ప్రదానం చేయడం విశేషం. తెలుగు సినిమా రంగానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన ఈ అవార్డులు గతంలో పలు కారణాలతో దాదాపు పద్నాలుగేళ్ల పాటు నిలిచిపోయాయి. అయితే గత ఏడాది నుంచి మళ్లీ ఈ పురస్కారాలను ప్రారంభించిన ప్రభుత్వం.. సినీ రంగంలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ ఉత్తమ చిత్రాల నిర్మాణానికి ప్రేరణనిస్తోంది. ఈసారి కూడా ఉగాది సందర్భంగా గద్దర్ సినీ అవార్డ్స్ 2025 వేడుకను నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ వేడుకలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డును అందుకున్న ఆమె స్టేజ్పైనే భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోవడం నాకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ… ‘గతంలో నేను ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నా. నా నటనపై విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నా నటనని మెచ్చి ఈ పురస్కారం ఇచ్చింది. రాష్ట్ర స్థాయి అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉంది’ అని చెప్పారు.
Also Read
- Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
- Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
- Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
- Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
Also Read: AP High Court: భార్య వివాహేతర సంబంధం, పిల్లలకు డీఎన్ఏ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు!
వేడుకలో రష్మిక చేసిన వ్యాఖ్యలు అందరి హృదయాలను హత్తుకున్నాయి. ‘ఇప్పటివరకు నన్ను కూతురిలా ఆదరించారు. ఇప్పుడు తెలంగాణ కోడలిగా మీ ముందుకు వచ్చాను. నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ రష్మిక భావోద్వేగంగా మాట్లాడారు. ఆమె మాటలు విన్న వెంటనే ప్రేక్షకుల్లో హర్షధ్వానాలు మార్మోగాయి. రష్మిక ప్రసంగం జరుగుతుండగా నటుడు విజయ్ దేవరకొండ తల్లి భావోద్వేగానికి లోనవడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఈ సన్నివేశం వేడుకకు మరింత హైలైట్గా నిలిచింది. మొత్తం మీద గద్దర్ సినీ అవార్డ్స్ వేడుక సినీ ప్రముఖులు, అభిమానుల మధ్య ఆనందోత్సాహాలతో కొనసాగి తెలుగు సినీ పరిశ్రమకు మరింత ఉత్సాహాన్ని నింపింది. రష్మిక ఇటీవల హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..