Boyapati Srinu : నన్ను చూసి అందరూ లేచి చేతులెత్తి దండం పెట్టారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన భారీ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పించిన ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో, డైరెక్టర్ బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో సినిమా విజయ విశేషాలను, ప్రేక్షకుల స్పందనను పంచుకున్నారు.
Also Read :Akhanda 2: నేనూ మనిషినే నాకూ కోపం వస్తుంది.. అన్నీ బాలయ్యే చేశారు!
Also Read
- Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
- OTT : డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్బస్టర్!
- Mahakali Release Date: 'మహాకాళి' రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
- Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్లో కొత్త ట్రెండ్
థియేటర్స్ విజిట్కు వెళ్లినప్పుడు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అనే ప్రశ్నకు బోయపాటి భావోద్వేగంతో సమాధానమిచ్చారు.”ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఒక మంచి సినిమా తీసి ఆశించాల్సింది డబ్బు కాదు, గౌరవం. అలాంటి గౌరవం ఈ సినిమాకు దక్కింది. సహజంగా థియేటర్స్ విజిట్కు వెళ్లినప్పుడు అందరూ నిలబడి విజిల్స్, క్లాప్స్ కొడతారు. కానీ, ఈ సినిమాకి వెళ్లినప్పుడు అందరూ లేచి చేతులెత్తి దండం పెట్టారు. నేను కూడా ‘మీ అందరి స్పందన చూడడానికే వచ్చానని’ అందరికీ నమస్కరించి వచ్చాను. నిజంగా ఇది చాలా గొప్ప అనుభూతి.” ప్రేక్షకులు తమ సినిమాను కేవలం వినోదంగా కాకుండా, గౌరవంతో స్వీకరించడం ఆయనను ఎంతగానో సంతోషపరిచిందని బోయపాటి వెల్లడించారు.
Also Read :45 The Movie: అంచనాలు పెంచేసిన శివ రాజ్కుమార్ ’45 ది మూవీ’ ట్రైలర్
ఈ సినిమాతో దర్శకుడిగా మీరు ఒక కొత్త ఏరియాలోకి ఎంటర్ అయినట్టుగా అనిపించిందా అనే ప్రశ్నకు బోయపాటి స్పందిస్తూ… “కొత్త పాత అని కాదు గాని, ఇదంతా మనలో మమేకమై ఉన్నది. మన ధర్మం మన తల్లి లాంటిది. మన తల్లి గురించి అద్భుతంగా చెప్పాము. మన ధర్మాన్ని మనం ఫాలో అయితే అద్భుతంగా ఉంటామని చెప్పాము. థియేటర్స్లో చిన్న పిల్లలు ఎక్కువమంది ఉన్నారు. వాళ్ళ కేరింతలు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది,” అని అన్నారు. ఈ విధంగా ‘అఖండ 2: ది తాండవం’ కేవలం యాక్షన్ సినిమాగా కాకుండా, సాంస్కృతిక, ధార్మిక అంశాలను కూడా ప్రేక్షకులకు చేరువ చేయడంలో విజయం సాధించిందని బోయపాటి శ్రీను స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!