Ammalakkalu: 70 ఏళ్ళ ‘అమ్మలక్కలు’
Ammalakkalu:’పాతాళభైరవి’ ఘనవిజయం తరువాత మహానటుడు యన్టీఆర్ జైత్రయాత్ర ఆరంభమైంది. ఆ తరువాత ఆయన చిత్రాలు తెలుగు,తమిళ భాషల్లో రూపొందసాగాయి. 1951లో “పాతాళభైరవి, మల్లీశ్వరి”, తరువాతి సంవత్సరం “పెళ్ళిచేసిచూడు, దాసి, పల్లెటూరు” చిత్రాల ఘనవిజయాలతో యన్టీఆర్ తీరే వేరుగా సాగుతూ ఉండేది. ఆయన తరువాతి చిత్రంగా ‘అమ్మలక్కలు’ రూపొందింది. ఈ సినిమా తమిళంలో ‘మరుమగల్’ పేరుతో ఏకకాలంలో తెరకెక్కింది. రెండు భాషల్లోనూ యన్టీఆర్ కథానాయకుడు. డి.యోగానంద్ దర్శకత్వంలో కృష్ణా పిక్చర్స్ పతాకంపై లెనా చెట్టియార్ ‘అమ్మలక్కలు’ నిర్మించారు. యన్టీఆర్ కు అంతకు ముందే మంచి మిత్రుడైన డి.యోగానంద్ ఈ చిత్రం ద్వారానే దర్శకునిగా పరిచయం కావడం విశేషం. ఈ సినిమా 1953 ఏప్రిల్ 14న విడుదలయింది.
‘అమ్మలక్కలు’ కథ ఏమిటంటే- రామయ్య, కిష్టయ్య మంచి స్నేహితులు. రామయ్యకు ఇద్దరు కొడుకులు సుందర్, కుమార్, కూతురు రూప ఉంటారు. కిష్టయ్యకు ఒకే కూతురు పేరు ఉష. రామయ్య కష్టాల్లో ఉంటే, తన ఇల్లు తాకట్టు పెట్టి, ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకోమంటాడు కిష్టయ్య. దాంతో పట్నం వెళ్ళి వ్యాపారం చేసిన రామయ్యకు లాభాలు వస్తాయి. మిత్రుని అప్పు తీరుస్తాడు. అంతేకాదు తన చిన్నకొడుకు కుమార్ కు, ఉషను ఇచ్చి పెళ్ళిచేయాలని రామయ్య అంటాడు. అందుకు కిష్టయ్య కూడా అంగీకరిస్తాడు. పట్నంలో చదివే కుమార్ ఎక్కడా, పల్లెటూరి అమ్మాయి ఉష ఎక్కడ అంటూ ఊళ్ళోని అమ్మలక్కలు ఆడిపోసుకుంటారు. ఇది విన్న కిష్టయ్య తన కూతురును కూడా పట్నంలో చదివిస్తాడు. కుమార్, ఉష ఒకే చోట చదువుకుంటారు. కాలేజ్ లోనూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ప్రేమించుకుంటారు. పెద్దలు కూడా ఎలాగూ నిశ్చయించారు కదా అని ఆనందంగా ఉంటారు. అయితే వారి కుటుంబాల్లోకి రామయ్య పెద్ద కొడుకు సుందర్ భార్య శాంత రావడంతో కలతలు మొదలవుతాయి. సుందర్ పెళ్ళిలో కిష్టయ్యను అమ్మలక్కలు కొందరు అవమానిస్తారు. దాంతో ఆ ఇంటి ముఖం చూడకూడదని భావిస్తాడు. అయితే కుమార్ వెళ్ళి, ఉషకు నచ్చచెప్పి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఇంట్లో కాపురం చేస్తూ ఆనందంగా ఉండగా, కుమార్ కు పైచదువులకు విదేశాల నుండి పిలుపు వస్తుంది. భార్య ప్రోత్సాహంతో వెళతాడు. కానీ, ఇక్కడ ఉషను అత్త, ఆడపడచు, తోడికోడలు అందరూ మాటలతో హింసిస్తూ ఉంటారు. అన్నిటినీ దిగమింగి అందరికీ తగిన బుద్ధి చెబుతుంది. చివరకు కుమార్ వచ్చాక, అందరినీ నిలదీస్తాడు. కానీ, ఉష మంచితనంతో అందరినీ కలుపుతుంది. అందరూ ఒక్కటవ్వడంతో కథ సుఖాంతమవుతుంది.
Also Read
- Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
ఇందులో కుమార్ గా యన్టీఆర్, ఉషగా పద్మిని నటించారు. మిగిలిన పాత్రల్లో అమర్ నాథ్, రేలంగి, లలిత, బి.ఆర్.పంతులు, డి.సుబ్రహ్మణ్యం, సూర్యకాంతం, ఋష్యేంద్రమణి, సురభి కమలాబాయి, సురభి బాలసరస్వతి నటించారు. ఈ చిత్రానికి సి.ఆర్.సుబ్బురామన్ సంగీతం సమకూర్చారు. “పెనుగొను మనసుల…”, “కన్నెమావి తోటలోన…”, “మారాడవేల మారాల చిలుక…”, “ఓ నీవే నా ప్రేమా…”, “ఉండాలోయ్…ఉండాలోయ్…” అంటూ సాగే పాటలు అలరించాయి.ఇందులో లలిత, పద్మిని చెల్లెలు అయిన రాగిణి ఓ పాటలో నృత్యంతో అలరించారు. అలా ముగ్గురు అక్కాచెల్లెలు లలిత, పద్మిని, రాగిణి ఈ సినిమాలో కనిపించారు. ఈ సినిమా రెండు భాషల్లోనూ మంచి విజయం సాధించింది. తెలుగులో తమిళం కన్నా మిన్నగా ఆదరణ పొందింది. తెలుగునాట రిపీట్ రన్స్ లోనూ ఆదరణ చూరగొంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!