Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story 55 Years For Sangeeta Lakshmi Movie

55 వసంతాల ‘సంగీత లక్ష్మి’

Published Date :July 7, 2021 , 12:06 am
By ramakrishna
55 వసంతాల ‘సంగీత లక్ష్మి’
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

సంగీత, నృత్యాలు ఇరుసులుగా కథారధం నడిచిన చిత్రం ‘సంగీత లక్ష్మి’. ఎన్టీఆర్, జమున జంటగా నటించిన ఈ సినిమా జూలై 7, 1966లో విడుదలైంది. అంటే నేటితో యాభై ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ తన చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్లుగా పనిచేసిన పలువురిని నిర్మాతలుగా మార్చారు. ఈ సినిమాకూ అలానే అమరా రామ సుబ్బారావు అనే ప్రొడక్షన్ మేనేజర్ ను నిర్మాతను చేశారు. పి. నరసింగరావుతో కలిసి అమరా రామ సుబ్బారావు ‘సంగీత లక్ష్మి’ చిత్రం నిర్మించారు. ఈ మూవీతో గిడుతూరి సూర్యం దర్శకుడిగా పరిచయం అయ్యారు. అభ్యుదయ మానవతా వాదిగా పేరున్న గిడుతూరి సూర్యం ఆకాశవాణిలో అనౌన్సర్ గా పనిచేస్తూనే నాటికలు, నాటకాలు, సంగీత రూపకాలు రాశారు. ‘సంగీత లక్ష్మి’ చిత్రం తర్వాత ఆయన ‘రణభేరి, ఆస్తికోసం, కథానాయకురాలు, విక్రమార్క విజయం, పేదరాశి పెద్దమ్మ కథ, నేను – నా దేశం’ వంటి పలు చిత్రాలు తెరకెక్కించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే… విజయవాడలో కాపురం ఉంటున్న కల్నల్ కొండలరావు (ఎస్వీ రంగారావు) ఏకైక కూతురు రాధ (జమున). శాస్త్రీయ సంగీత ప్రియురాలు. అదే ఊరిలో ఉంటున్న వేణు (ఎన్టీ రామారావు) సంగీతారాధకుడు. ఇద్దరికీ మద్రాసులో జరిగిన సంగీత పోటీలలో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. చివరికి వివాహమూ చేసుకుంటారు. అయితే మేనల్లుడు ఆనంద్ (నాగభూషణం)కు రాధను ఇచ్చి పెళ్ళి చేయాలని కొండలరావు అనుకుంటాడు. తన ఆలోచనలకు విరుద్ధంగా కూతురు వివాహం చేసుకుందని దూరం పెడతాడు. అలానే తమ ప్రమేయం లేకుండా కొడుకు పెళ్ళి చేసుకున్నాడని వేణు కుటుంబం కూడా అతన్ని దూరం పెట్టేస్తుంది. స్వాభిమానంతో తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి ఈ కొత్త దంపతులు ప్రయత్నిస్తుంటారు. నిజానికి వీరి పెళ్ళికి ప్రధాన కారకుడు ఆనందే. అతను నళిని (విజయలక్ష్మీ) అనే నర్తకిని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్ళి చేసుకుంటాడు. సంసార సాగరాన్ని అతికష్టం మీద వేణు ఈదుతున్న సమయంలోని వారికి పాప పుడుతుంది. ఆమెకు లక్ష్మీ అని పేరు పెడతారు. ఆనంద్ తన వంతుగా వేణు, రాధలకు సాయం చేయాలని చూస్తాడు కానీ ఆ ప్రయత్నాలు వీరి మధ్య పొరపొచ్చలకు కారణం అవుతాయి. పర్యవసానంగా వేణు, రాధ దూరమౌతారు. ఈ నిజమైన ప్రేమికులు, సంగీతాభిమానులు చివరకు ఎలా ఒకటి అయ్యారు? వారి కూతురు లక్ష్మీ… ‘సంగీత లక్ష్మీ’గా ఎలా గుర్తింపు తెచ్చుకుంది అన్నదే మిగతా కథ.

Also Read

  • Peddi: 'పెద్ది' రన్ టైంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
  • Ashu Reddy: షాకింగ్.. చీటింగ్ కేసు నడుస్తుండగానే ఎంగేజ్మెంట్ చేసుకున్న అషు రెడ్డి
  • Peddi: బాక్సాఫీస్ బద్దలే.. మెగా దాహం తీర్చనున్న పెద్ది?
  • NTR: ఇదెక్కడి లుక్? ఒకే ఒక్క ఫోటోకు సోషల్ మీడియా షేక్!
Add as a preferred
source on google

కథలోని బలమైన సంఘటనల కారణంగానూ, నటీనటులు ప్రతిభావంతులు కావడం చేతను అన్ని సన్నివేశాలు చక్కగా పండాయి. ఎన్టీఆర్, జమున, ఎస్వీ రంగారావు, నాగభూషణం, విజయలక్ష్మితో పాటుగా రమణారెడ్డి, రాజబాబు, పెరుమాళ్లు, సూర్యకాంతం, నిర్మల, ఏడిద నాగేశ్వరరావు, మోదుకూరి సత్యం తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులోని ఓ స్టేజ్ ప్లేలో ఎన్టీఆర్ అర్జునుడిగా నటించగా, కృష్ణ పాత్రను జమున చేయడం విశేషం. దర్శకత్వం గిడుతూరి సూర్యమే కథ, కథనాలను సమకూర్చుకున్నాడు. ఆత్రేయ మాటలు రాయడంతో పాటు నాలుగైదు పాటలూ రాశారు. శ్రీశ్రీ, దాశరథి, సినారె, ఏడ్చూరి సుబ్రహ్మణ్యం మిగిలిన పాటలు రాశారు. సంగీత ప్రధాన చిత్రం కావడంతో సంగీత దర్శకులు ఎస్. రాజేశ్వరరావు తన ప్రతిభను చాటుకోవడానికి దోహదపడింది. చిత్రం ఏమంటే… ఎన్టీయార్ వానపాట… అందులోనూ డ్యూయెట్ అనగానే ఈ తరానికి ‘వేటగాడు’లోని ‘ఆకుచాటు పిందతడిసే’ పాటే గుర్తొస్తుంది. నిజానికి ఆ రోజుల్లోనే ‘కలో నిజమో కమ్మని ఈ క్షణము’ అంటూ సాగే వానపాటలో ఎన్టీఆర్, జమున నర్తించి మెప్పించారు.

సంసారిక జీవితంలో మాటపట్టింపులు వంటివి కాలగమనంలో కరిగిపోతాయనే అంశంతో సంగీత, నృత్య ప్రధానంగా రూపుదిద్దుకున్న ‘సంగీత లక్ష్మి’ చిత్రం మొదటిసారి విడుదలయినప్పుడు ఘన విజయం సాధించకపోయినా, రిపీట్ రన్ లో ప్రేక్షకుల మనసులు చూరగొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 55 Years For Sangeeta Lakshmi Movie
  • Amara Ramasubba Rao
  • Giduturi Suryam
  • Jamuna
  • N. T. Rama Rao

తాజావార్తలు

  • Peddi: ‘పెద్ది’ రన్ టైంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!

  • Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్‌రెడ్డి

  • AP Weather Update: భిన్న వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆ జిల్లాల్లో వడగాలులు..

  • Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్‌గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!

  • Congress MLA Rs 300 Crore Demand: రూ.300 కోట్లు ఇస్తేనే పార్టీలో ఉంటా.. మహిళా ఎమ్మెల్యే డిమాండ్‌తో కాంగ్రెస్‌లో కలకలం..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions