పూజా కార్యక్రమాలతో లాంఛనంగా “భోళా శంకర్” ప్రారంభోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ ఈ రోజు ఉదయం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చిరు అయ్యప్ప మాలలో ప్రత్యేక పూజలు చేశారు. మ్యూజిక్ కంపోజర్ మణిశర్మ, దర్శకులు వివి వినాయక్, గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ తదితరులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తొలి క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. వివి వినాయక్ కెమెరా స్విచాన్ చేశారు. అంతకు ముందు ఈ కార్యక్రమానికి హాజరైన కొరటాల శివ, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, బాబీ, మలినేని గోపీచంద్, ఎన్ శంకర్, రచయిత సత్యానంద్లు చిత్ర స్క్రిప్ట్ను మేకర్స్కి అందజేశారు. ‘భోళా శంకర్’ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుండి ప్రారంభమవుతుంది. “భోళా శంకర్”లో చిరు కథానాయికగా తమన్నా నటిస్తుండగా, మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ కనిపించనుంది. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘వేదాళం’ మాదిరిగానే భోళా శంకర్” కథ కూడా కోల్కతానేపథ్యంలో సాగుతుంది. సినిమా షూటింగ్లో ఎక్కువ భాగం ఈ ఐకానిక్ సిటీలో జరుగుతుంది. మహతి స్వర సాగర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ను అందించగా, డడ్లీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!