Chiranjeevi: రాజమౌళి డైరెక్షన్లో సినిమా.. బాంబ్ పేల్చిన మెగాస్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi Shocking Comments On Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి.. ఇప్పటివరకూ ఒక్క ఓటమి కూడా ఎరుగని దర్శకుడు. బాహుబలి తెలుగు చిత్రసీమ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిచెప్పిన ఈయన.. ఆర్ఆర్ఆర్తో విదేశీ గడ్డలపై తన సత్తా చాటాడు. మనకన్నా విదేశీయులే ఈ సినిమా ఆస్కార్ పురస్కారాలు సాధించాలని బలంగా కోరుకుంటున్నారంటే, ఏ రేంజ్లో ఆ సినిమా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. దటీజ్ జక్కన్న. అలాంటి దర్శకుడితో సినిమా చేయాలని ఎవరు కోరుకోరు చెప్పండి? ఎందరో స్టార్ హీరోలు ఆయనతో కలిసి పని చేయాలని ఉబలాటపడుతున్నారు. అంతెందుకు, ఒక చిన్న పాత్ర పోషించే ఛాన్స్ ఇచ్చినా చాలని కోరుకునే వారు కోకొల్లలు. కానీ, తనకు మాత్రం రాజమౌళి డైరెక్షన్లో నటించాలన్న ఆశ లేదని మెగాస్టార్ చిరంజీవి బాంబ్ పేల్చారు.
‘‘రాజమౌళి ఒక గొప్ప దర్శకుడు. ఆయన భారత సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రతీ విషయాన్ని ఆయన ఎంతో లోతుగా చూస్తారు. ఒక నటుడిగా ఆయన కోరుకునే ఔట్పుట్ని నేను ఇవ్వగలనో లేదో తెలియదు. ఇక జక్కన్న ఒక్కో సినిమాకి ఎంత సమయం తీసుకుంటాడో అందరికీ తెలుసు. మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం కచ్ఛితంగా తీసుకుంటాడు. కానీ నేను ఒకేసారి మూడు నుంచి నాలుగు సినిమాలు చేస్తున్నా. అందుకే, ఆయనతో పని చేయాలని గానీ, పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆశ గానీ లేదు’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. తన ‘గాడ్ఫాదర్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా.. ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు ఈ విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి, దీనిపై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్గా మారిన ఫోటోలు!
- Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
- Jagapathi Babu: ఒకప్పటి స్టార్ హీరో.. రోడ్డుపై అంతలా తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు? వైరల్ అవుతున్న వీడియో!
కాగా.. ‘గాడ్ఫాదర్’ సినిమా మలయాళంలో బ్లాక్బస్టర్ విజయం సాధించిన ‘లూసిఫర్’కి రీమేక్. ఇందులో మోహన్లాల్ పాత్రలో చిరంజీవి నటించగా.. వివేక్ ఓబెరాయ్ పాత్రని సత్యదేవ్ పోషించాడు. ఇక అందులో అత్యంత కీలకమైన పృథ్విరాజ్ రోల్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించగా.. నయనతార ఓ ప్రధాన పాత్రలో నటించింది. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకుడు. అక్టోబర్ 5వ తేదీన ఈ చిత్రం భారీఎత్తున విడుదల కాబోతోంది.
తాజావార్తలు
-
Test Match: ఆ ప్లేయర్కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
-
Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
-
Kitchen Tips: బియ్యంలో పురుగుల నుంచి బిర్యానీ రైస్ వరకు.. వంటగది రూపురేఖలు మార్చే అమేజింగ్ చిట్కాలు!
-
Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
-
Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!