Tollywood : సమస్య పరిష్కారం కోసం రంగంలోకి చిరంజీవి
- టాలీవుడ్లో కార్మికుల సమ్మెకు ఫుల్స్టాప్ పెట్టేందుకు రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి
- రేపు నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులతో భేటీ
- ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునే యోచనలో చిరంజీవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood : గత కొద్ది కాలంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తమకు వేతనాలు పెంచాలని, అది కూడా 30% వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ పెంచిన వారికి మాత్రమే షూటింగ్కు హాజరవుతామని ప్రకటించింది. అయితే, తదనంతర పరిస్థితులలో ఎవరూ షూటింగ్ జరపకూడదని ఫిలిం ఛాంబర్ ప్రకటించడంతో పూర్తిగా టాలీవుడ్ షూటింగ్స్ నిలిచిపోయాయి. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం గతంలోనే చిరంజీవి ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో భేటీ అయ్యారని ప్రచారం జరిగింది. తర్వాత చిరంజీవి దాన్ని ఖండించారు. అయితే, తాజాగా చిరంజీవి ఈ భేటీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రేపు ఉదయం తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో పాటు తెలుగు నిర్మాతలను వేర్వేరుగా కలవనున్నారు. ఫెడరేషన్ తరఫున అన్ని యూనియన్ల ప్రతినిధులను కూడా ఈ భేటీకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.
Read Also : Chiranjeevi : నా కెరీర్ లో స్టాలిన్ ఎంతో ప్రత్యేకం.. చిరు ఎమోషనల్
Also Read
అటు సినీ కార్మికులకు, ఇటు నిర్మాతలకు ఇబ్బంది కలుగకుండా మెగాస్టార్ చిరంజీవి ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇతర భాషల సినీ పరిశ్రమల నుంచి కూడా ఆయన సమాచారం సేకరిస్తున్నారని అంటున్నారు. ఆయా భాషలలో ప్రస్తుతం వేతనాలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలించి, ఇక్కడ అందరికీ ఆమోదయోగ్యమయ్యేలా వేతనాలపై ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఎలా చెబితే అలా వింటామని ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు గతంలోనే ప్రకటించారు. కాబట్టి, ఈ సమస్యకు రేపటితో చెక్ పడే అవకాశం ఉంది.
Read Also : Udaya Bhanu : ఎక్కడ తిట్టాలో వాళ్లే చెప్తారు.. టీవీ షోలపై ఉదయభాను సెటైర్లు..
తాజావార్తలు
-
Jagtial: జగిత్యాల జిల్లాలో బీజేపీ vs కాంగ్రెస్ పార్టీల మధ్య సవాళ్లు.. పట్టణంలో పోస్టర్లు కలకలం
-
RBI New Currency Notes: ఆర్బీఐ సంచలన ప్లాన్..? పాత కరెన్సీ నోట్లు బ్యాన్..!?
-
Explainer: చనిపోయిన తర్వాత భారతీయుల ర*క్తాన్ని తాగుతున్నారు.. వెలుగులోకి భయంకర లెక్కలు!
-
Peddi Team Takes : ఆన్లైన్ టార్గెటెడ్ నెగిటివిటీపై ‘పెద్ది’ టీమ్ లీగల్ యాక్షన్ స్టార్ట్
-
‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP).. కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ..!
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!