ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థీవ దేహం… సినీ ప్రముఖుల కన్నీటి నివాళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల ఇక లేరన్న విషయాన్నీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కిమ్స్ నుంచి నేరుగా ఫిల్మ్ ఛాంబర్ కు సిరివెన్నెల పార్థివదేహం తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థివదేహాన్ని ఉంచారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు కడసారిగా కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు రాజమౌళి కుటుంబ సమేతంగా ఆయన పార్థివదేశాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థివ దేహాన్ని చూసి సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం సిరివెన్నెలకి నివాళులు అర్పించారు తనికెళ్ళ. డైరెక్టర్ మారుతి, హీరో వెంకటేష్, ఎస్వీ కృష్ణారెడ్డి, సింగర్ సునీత, కూడా సిరివెన్నెల పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఇంకా పలువురు ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా కడసారి నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సిరివెన్నెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Read Also : సిరివెన్నెల మృతిపై ఆర్జీవీ ఎమోషనల్ పోస్ట్
Also Read
లెజెండరీ గేయ రచయిత పద్మశ్రీ చెంబోలు సీతారామశాస్త్రి (66) ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో నవంబర్ 30న సాయంత్రం 4:07 గంటలకు తుది శ్వాస విడిచారు.
తాజావార్తలు
-
CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
-
SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
-
RCB IPL 2026 Playoffs: ఆర్సీబీకి భారీ షాక్.. ప్లేఆఫ్స్ రేసులో కొత్త టెన్షన్!
-
DRDO TARA Test: డీఆర్డీఓ స్వదేశీ ‘తారా’ కిట్ టెస్ట్ సక్సెస్.. శత్రువులకిక దబిడి దిబిడే
-
Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!