పదేళ్ళ ‘బిజినెస్ మేన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేశ్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం ‘పోకిరి’ అరుదైన రికార్డులు నమోదు చేసింది. 2006లో ఆల్ టైమ్ హిట్ గా నిలచిన ‘పోకిరి’ వచ్చాక దాదాపు ఆరేళ్ళకు మళ్ళీ మహేశ్, పూరి కాంబోలో ‘బిజినెస్ మేన్’ రూపొందింది. ‘పోకిరి’ కాంబినేషన్ రిపీట్ కావడంతో ‘బిజినెస్ మేన్’కు మొదటి నుంచీ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. అందుకు తగ్గట్టుగానే 2012 జనవరి 13న విడుదలైన ‘బిజినెస్ మేన్’ మంచి వసూళ్ళు రాబట్టింది.
‘బిజినెస్ మేన్’ కథ విషయానికి వస్తే- ఓ యువకుడు ఒంటరిగా దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి వెళ్ళి అక్కడి చీకటిదందాలోనే వేలు పెట్టి, నేర చరిత గలవారిని ఎలా హడలెత్తించాడు అన్నదే ప్రధానాంశం. ముంబయ్ లోని ధారవి ప్రాంతంలోని పేదవారిని మోసం చేసి, వారి స్థలాలను కొట్టేయాలని కొందరు ప్రయత్నిస్తారు. దానిని విజయ్ సూర్య అడ్డుకొని, వారి పట్టాలు వారికే దక్కేలా చేస్తాడు. దాంతో అందరిలోనూ హీరో అయిపోతాడు. అదే సమయంలో ముంబై పోలీస్ కమీషనర్ అజయ్ భరద్వాజ్ నేరస్థులను ఏరిపారేసే కార్యక్రమం చేపట్టి ఉంటాడు. అజయ్ కూతురు చిత్రను తన చాతుర్యంతో ప్రేమలోకి దించుతాడు విజయ్. కూతురుకు విజయ్ ఓ నీచుడని నిరూపిస్తాడు అజయ్ భరద్వాజ. కానీ, అసలైన నేరస్థులను ఏరిపారేయడంలో అతనే ఘటికుడని అజయ్ భావిస్తాడు. అతణ్ణి కొందరు మట్టుపెడతారు. చివరి క్షణాల్లో కూతురును, ముంబై నగరాన్ని నీవే కాపాడాలంటూ విజయ్ ను కోరతాడు అజయ్. నేరస్థులను, వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులను విజయ్ ఏరిపారేస్తాడు. విజయ్ అసలు ఉద్దేశం ఏమిటో తెలిసిన చిత్ర మళ్ళీ అతని ప్రేమను అంగీకరిస్తుంది. చివరలో విజయ్, “నీ కంటే ఇక్కడ ఎవడూ తోపు లేడు…” అంటూ యూత్ కు సందేశమివ్వడంతో కథ ముగుస్తుంది.
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
మహేశ్ బాబు, కాజల్ అగర్వాల్, నాజర్, ప్రకాశ్ రాజ్, సయాజీ షిండే, రాజా మురాద్, సుబ్బరాజు, బ్రహ్మాజీ, ధర్మవరపు, భరత్ రెడ్డి, రాజీవ్ మెహతా, బండ్ల గణేశ్, ఆకాశ్, శ్వేతా భరద్వాజ్ నటించిన ఈ చిత్రంలో ఓ సీన్ లో క్యాబ్ డ్రైవర్ గా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కనిపిస్తారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చగా, భాస్కరభట్ల పాటలు రాశారు. “సారొస్తారొస్తారా…”, “పిల్లా చావ్…”, “చందమామా…”, “బ్యాడ్ బోయ్స్…”, “ఆమ్చీ ముంబై..” అంటూ సాగే పాటలు అలరించాయి. 2012లో విడుదలైన సంక్రాంతి చిత్రాలలో ‘బిజినెస్ మేన్’ విజేతగా నిలచింది.
తాజావార్తలు
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..