పదేళ్ళ ‘బిజినెస్ మేన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేశ్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం ‘పోకిరి’ అరుదైన రికార్డులు నమోదు చేసింది. 2006లో ఆల్ టైమ్ హిట్ గా నిలచిన ‘పోకిరి’ వచ్చాక దాదాపు ఆరేళ్ళకు మళ్ళీ మహేశ్, పూరి కాంబోలో ‘బిజినెస్ మేన్’ రూపొందింది. ‘పోకిరి’ కాంబినేషన్ రిపీట్ కావడంతో ‘బిజినెస్ మేన్’కు మొదటి నుంచీ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. అందుకు తగ్గట్టుగానే 2012 జనవరి 13న విడుదలైన ‘బిజినెస్ మేన్’ మంచి వసూళ్ళు రాబట్టింది.
‘బిజినెస్ మేన్’ కథ విషయానికి వస్తే- ఓ యువకుడు ఒంటరిగా దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి వెళ్ళి అక్కడి చీకటిదందాలోనే వేలు పెట్టి, నేర చరిత గలవారిని ఎలా హడలెత్తించాడు అన్నదే ప్రధానాంశం. ముంబయ్ లోని ధారవి ప్రాంతంలోని పేదవారిని మోసం చేసి, వారి స్థలాలను కొట్టేయాలని కొందరు ప్రయత్నిస్తారు. దానిని విజయ్ సూర్య అడ్డుకొని, వారి పట్టాలు వారికే దక్కేలా చేస్తాడు. దాంతో అందరిలోనూ హీరో అయిపోతాడు. అదే సమయంలో ముంబై పోలీస్ కమీషనర్ అజయ్ భరద్వాజ్ నేరస్థులను ఏరిపారేసే కార్యక్రమం చేపట్టి ఉంటాడు. అజయ్ కూతురు చిత్రను తన చాతుర్యంతో ప్రేమలోకి దించుతాడు విజయ్. కూతురుకు విజయ్ ఓ నీచుడని నిరూపిస్తాడు అజయ్ భరద్వాజ. కానీ, అసలైన నేరస్థులను ఏరిపారేయడంలో అతనే ఘటికుడని అజయ్ భావిస్తాడు. అతణ్ణి కొందరు మట్టుపెడతారు. చివరి క్షణాల్లో కూతురును, ముంబై నగరాన్ని నీవే కాపాడాలంటూ విజయ్ ను కోరతాడు అజయ్. నేరస్థులను, వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులను విజయ్ ఏరిపారేస్తాడు. విజయ్ అసలు ఉద్దేశం ఏమిటో తెలిసిన చిత్ర మళ్ళీ అతని ప్రేమను అంగీకరిస్తుంది. చివరలో విజయ్, “నీ కంటే ఇక్కడ ఎవడూ తోపు లేడు…” అంటూ యూత్ కు సందేశమివ్వడంతో కథ ముగుస్తుంది.
Also Read
- Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
- Idupu Kayitham : 'ఇడుపు కాయితం' చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
- Suhas: "చేతిలో కత్తి.. కళ్లలో కసి!" ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
- Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
మహేశ్ బాబు, కాజల్ అగర్వాల్, నాజర్, ప్రకాశ్ రాజ్, సయాజీ షిండే, రాజా మురాద్, సుబ్బరాజు, బ్రహ్మాజీ, ధర్మవరపు, భరత్ రెడ్డి, రాజీవ్ మెహతా, బండ్ల గణేశ్, ఆకాశ్, శ్వేతా భరద్వాజ్ నటించిన ఈ చిత్రంలో ఓ సీన్ లో క్యాబ్ డ్రైవర్ గా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కనిపిస్తారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చగా, భాస్కరభట్ల పాటలు రాశారు. “సారొస్తారొస్తారా…”, “పిల్లా చావ్…”, “చందమామా…”, “బ్యాడ్ బోయ్స్…”, “ఆమ్చీ ముంబై..” అంటూ సాగే పాటలు అలరించాయి. 2012లో విడుదలైన సంక్రాంతి చిత్రాలలో ‘బిజినెస్ మేన్’ విజేతగా నిలచింది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!