స్టార్ హీరోలకు “రాధేశ్యామ్” గుబులు… వెనక్కి తగ్గుతారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. 1970లో యూరప్ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాను ‘ప్రభాస్ 20’ పేరుతో 2018 సెప్టెంబర్ 5న ప్రారంభించారు. సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఇంకా విడుదల కాలేదు. ఒకానొక సమయంలో ప్రభాస్ అభిమానులు సినిమా ఇంకెంతకాలం తీస్తారంటూ మేకర్స్ పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. మరికొంత మంది సెటైర్లు పేల్చారు. ఏదైతేనేం మొత్తానికి సినిమా పూర్తి కావచ్చింది. అయితే ఒక రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని చెప్పి, సినిమా షూటింగ్ ను మరీ సినిమాను అంతలా సాగదీయడం, “సాహో” సినిమాకు కూడా ఇలాగే జరగడంతో ‘రాధేశ్యామ్’ ఎఫెక్ట్ తగ్గడం మొదలైంది. సినిమాను తక్కువ అంచనా వేసిన మిగతా సినిమాల మేకర్స్ ఈ పాన్ ఇండియా సినిమాకు పోటీగా తమ సినిమాలను విడుదల చేయడానికి ధైర్యంగా ముందడుగు వేశారు. అలా “రాధేశ్యామ్”ను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయబోతున్నాము అని ప్రకటించగానే ‘సర్కారు వారి పాట’, ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాల విడుదల తేదీలు కూడా ప్రకటించేశారు.
‘రాధేశ్యామ్’ టీజర్ ఎఫెక్ట్
అయితే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజున టాలీవుడ్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న “రాధేశ్యామ్” టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో సునామీని సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా యూనిక్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ లో ప్రభాస్ లుక్, డైలాగ్స్, సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటేమిటి అన్నీ అద్భుతః అన్నట్టుగా ఉన్నాయి. ఇక ‘రాధేశ్యామ్’ ఇప్పటి వరకు ఉన్న చాలా రికార్డులను బ్రేక్ చేసింది. టీజర్ తోనే ‘రాధేశ్యామ్’ సృష్టించిన తుఫానుకు మిగతా హీరోలకు గుబులు పట్టుకున్నట్టుగా కన్పిస్తోంది.
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
తాజా సమాచారం మేరకు ‘రాధేశ్యామ్’ దూకుడు చూసిన పవన్, మహేష్ తమ సినిమాలను వాయిదా వేసుకోబోతున్నారని తెలుస్తోంది. “భీమ్లా నాయక్” జనవరి 12న, “సర్కారు వారి పాట” జనవరి 13న విడుదల కానున్నాయని అధికారికంగా ప్రకటించారు. కానీ ‘రాధేశ్యామ్’ టీజర్ ను, దాని ఎఫెక్ట్ ను చూశాక తమ నిర్ణయాన్ని మార్చుకునే పనిలో పడ్డారట ఆ రెండు సినిమాల మేకర్స్.
మహేష్, పవన్ సినిమాలు వాయిదా ?
ఈ మేరకు “భీమ్లా నాయక్” నిర్మాతలు కొన్ని తేదీలను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ చిత్రం జనవరి 26 విడుదల కావాల్సి ఉండగా, తాజా పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి 1న విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రకటన వెలువడే అవకాశం ఉందట. “భీమ్లా నాయక్” షూటింగ్ నవంబర్ నాటికి పూర్తవుతుంది. ఇక “సర్కారు వారి పాట” 2022 వేసవిలో విడుదల కానుంది. ఏప్రిల్ 28న ఈ సినిమాను విడుదల చేయాలనీ మేకర్స్ ఆలోచిస్తున్నారట. “సర్కారు వారి పాట” షూటింగ్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుంది. ఏదేమైనా లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చి స్టార్ హీరోల్లో గుబులు రేపి, వెనక్కి తగ్గేలా చేశాడు “రాధేశ్యామ్”.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!