స్టార్ హీరోలకు “రాధేశ్యామ్” గుబులు… వెనక్కి తగ్గుతారా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. 1970లో యూరప్ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాను ‘ప్రభాస్ 20’ పేరుతో 2018 సెప్టెంబర్ 5న ప్రారంభించారు. సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఇంకా విడుదల కాలేదు. ఒకానొక సమయంలో ప్రభాస్ అభిమానులు సినిమా ఇంకెంతకాలం తీస్తారంటూ మేకర్స్ పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. మరికొంత మంది సెటైర్లు పేల్చారు. ఏదైతేనేం మొత్తానికి సినిమా పూర్తి కావచ్చింది. అయితే ఒక రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని చెప్పి, సినిమా షూటింగ్ ను మరీ సినిమాను అంతలా సాగదీయడం, “సాహో” సినిమాకు కూడా ఇలాగే జరగడంతో ‘రాధేశ్యామ్’ ఎఫెక్ట్ తగ్గడం మొదలైంది. సినిమాను తక్కువ అంచనా వేసిన మిగతా సినిమాల మేకర్స్ ఈ పాన్ ఇండియా సినిమాకు పోటీగా తమ సినిమాలను విడుదల చేయడానికి ధైర్యంగా ముందడుగు వేశారు. అలా “రాధేశ్యామ్”ను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయబోతున్నాము అని ప్రకటించగానే ‘సర్కారు వారి పాట’, ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాల విడుదల తేదీలు కూడా ప్రకటించేశారు.
‘రాధేశ్యామ్’ టీజర్ ఎఫెక్ట్
అయితే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజున టాలీవుడ్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న “రాధేశ్యామ్” టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో సునామీని సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా యూనిక్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ లో ప్రభాస్ లుక్, డైలాగ్స్, సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటేమిటి అన్నీ అద్భుతః అన్నట్టుగా ఉన్నాయి. ఇక ‘రాధేశ్యామ్’ ఇప్పటి వరకు ఉన్న చాలా రికార్డులను బ్రేక్ చేసింది. టీజర్ తోనే ‘రాధేశ్యామ్’ సృష్టించిన తుఫానుకు మిగతా హీరోలకు గుబులు పట్టుకున్నట్టుగా కన్పిస్తోంది.
Also Read
- Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
- Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
- Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
- Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!
తాజా సమాచారం మేరకు ‘రాధేశ్యామ్’ దూకుడు చూసిన పవన్, మహేష్ తమ సినిమాలను వాయిదా వేసుకోబోతున్నారని తెలుస్తోంది. “భీమ్లా నాయక్” జనవరి 12న, “సర్కారు వారి పాట” జనవరి 13న విడుదల కానున్నాయని అధికారికంగా ప్రకటించారు. కానీ ‘రాధేశ్యామ్’ టీజర్ ను, దాని ఎఫెక్ట్ ను చూశాక తమ నిర్ణయాన్ని మార్చుకునే పనిలో పడ్డారట ఆ రెండు సినిమాల మేకర్స్.
మహేష్, పవన్ సినిమాలు వాయిదా ?
ఈ మేరకు “భీమ్లా నాయక్” నిర్మాతలు కొన్ని తేదీలను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ చిత్రం జనవరి 26 విడుదల కావాల్సి ఉండగా, తాజా పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి 1న విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రకటన వెలువడే అవకాశం ఉందట. “భీమ్లా నాయక్” షూటింగ్ నవంబర్ నాటికి పూర్తవుతుంది. ఇక “సర్కారు వారి పాట” 2022 వేసవిలో విడుదల కానుంది. ఏప్రిల్ 28న ఈ సినిమాను విడుదల చేయాలనీ మేకర్స్ ఆలోచిస్తున్నారట. “సర్కారు వారి పాట” షూటింగ్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుంది. ఏదేమైనా లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చి స్టార్ హీరోల్లో గుబులు రేపి, వెనక్కి తగ్గేలా చేశాడు “రాధేశ్యామ్”.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!