Bhairavam : టాలీవుడ్ లో ఎప్పటి నుంచో వినిపిస్తున్న మూవీ భైరవం. ఈ మూవీ రిలీజ్ డేట్ పై చాలా రకాల అనుమానాలు మొన్నటి వరకు వినిపించాయి. కానీ తాజాగా వాటికి చెక్ పెడుతూ రిలీజ్ డేట్ ను ప్రకటించింది మూవీ టీమ్. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్నారు. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాను ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో వాయిదా వేశారు. తాజాగా మే 30న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Read Also : Pawan Kalyan: 96 ఏళ్ల వృద్దురాలితో కలిసి భోజనం చేసిన పవన్.. కారణం ఏంటంటే?
ఈ మేరకు కొత్త పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఇక నుంచి వరుస అప్డేట్లు వస్తాయని.. మూవీ ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతాయని తెలిపారు. ఈ ముగ్గురి నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. సాయి శ్రీనివాస్ అప్పుడప్పుడు కనిపిస్తున్నా.. హిట్ లేదు. ఇక రోహిత్, మనోజ్ అయితే ఐదారేళ్ల క్రితం కనిపించారు. ఇప్పుడు ఈ మూవీ భారీ ఎత్తున వస్తోంది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో ఉన్నారు ఈ ముగ్గురూ కూడా. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ ముగ్గురూ ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేయబోతున్నారు.
Read Also : Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఏపీ అధికారికి డిమోషన్!