Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఏపీ అధికారికి డిమోషన్!
- సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- డిప్యూటీ కలెక్టర్ను తహశీల్దారుగా డిమోట్
- హైకోర్టు కన్నా పెద్దవాడని అనుకుంటున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిప్యూటీ కలెక్టర్ను తహశీల్దారుగా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్ రావును ఎమ్మార్వోగా డిమోట్ చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. అంతేకాదు కోర్టు ధిక్కరణ కింద రెండు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అధికారులు చట్టానికి అతీతులమనే భావన తగదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన మోహన్ రావుపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్కు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
గతంలో (2013-2024) గుంటూరు తహశీల్దారుగా తాతా మోహనరావు పనిచేస్తున్న సమయంలో అడవితక్కెళ్ల పాడులో పేదల గుడిసెలను పోలీసుల బందోబస్తు మధ్య తొలగించారు. అయితే యధాతధ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోలేదు. దీనిపై హైకోర్టు రెండు నెలల జైలుశిక్ష విధించింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో మోహనరావు సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అధికారులు చట్టానికి అతీతులమన్న భావనతో వ్యవహరించకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతి అధికారి హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత ఉందన్నారు. అతడిని ఒకసారి కోర్టు హెచ్చరించింది అయినా తిరిగి అదే చర్య చేశాడు, అతన్ని ఎలా క్షమించాలి అని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించింది. తను హైకోర్టు కన్నా పెద్దవాడని అనుకుంటున్నాడా? అని ధర్మాసనం మండిపడింది.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
Also Read: TG EAPCET 2025: మే 11న తెలంగాణ ఈఏపీసెట్ పలితాలు!
ఎన్ని కుటుంబాలను ఖాళీ చేయించావు?, 80 మంది పోలీసులతో వెళ్లి హైకోర్టు ఆదేశాల్ని విస్మరించావు అని తాతా మోహనరావుపై ధర్మాసనం ఫైర్ అయింది. అతను 48 గంటలు కస్టడీలో ఉంటే ఉద్యోగం పోతుందని వ్యాఖ్యానించింది. ప్రతి అధికారికి హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత ఉందని తెలుసుకోవాలని స్పష్టం చేసింది. తాతా మోహనరావుకి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని న్యాయవాది కోర్ట్ దృష్టికి తెచ్చినప్పుడు.. న్యాయమూర్తి గవాయ్ జోక్యం చేసుకొని అతను ఎన్నో కుటుంబాలను ఖాళీ చేయించాడు, వారి పిల్లలు ఎమవుతారు? అని మండిపడ్డారు. సాధారణ పరిస్థితుల్లో పిటిషన్ తీసుకోవడం సరికాదు, అయినా మేము కొంత సహనాన్ని పాటిస్తూ నోటీసు జారీ చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!