Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఏపీ అధికారికి డిమోషన్!
- సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- డిప్యూటీ కలెక్టర్ను తహశీల్దారుగా డిమోట్
- హైకోర్టు కన్నా పెద్దవాడని అనుకుంటున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిప్యూటీ కలెక్టర్ను తహశీల్దారుగా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్ రావును ఎమ్మార్వోగా డిమోట్ చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. అంతేకాదు కోర్టు ధిక్కరణ కింద రెండు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అధికారులు చట్టానికి అతీతులమనే భావన తగదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన మోహన్ రావుపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్కు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
గతంలో (2013-2024) గుంటూరు తహశీల్దారుగా తాతా మోహనరావు పనిచేస్తున్న సమయంలో అడవితక్కెళ్ల పాడులో పేదల గుడిసెలను పోలీసుల బందోబస్తు మధ్య తొలగించారు. అయితే యధాతధ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోలేదు. దీనిపై హైకోర్టు రెండు నెలల జైలుశిక్ష విధించింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో మోహనరావు సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అధికారులు చట్టానికి అతీతులమన్న భావనతో వ్యవహరించకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతి అధికారి హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత ఉందన్నారు. అతడిని ఒకసారి కోర్టు హెచ్చరించింది అయినా తిరిగి అదే చర్య చేశాడు, అతన్ని ఎలా క్షమించాలి అని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించింది. తను హైకోర్టు కన్నా పెద్దవాడని అనుకుంటున్నాడా? అని ధర్మాసనం మండిపడింది.
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
Also Read: TG EAPCET 2025: మే 11న తెలంగాణ ఈఏపీసెట్ పలితాలు!
ఎన్ని కుటుంబాలను ఖాళీ చేయించావు?, 80 మంది పోలీసులతో వెళ్లి హైకోర్టు ఆదేశాల్ని విస్మరించావు అని తాతా మోహనరావుపై ధర్మాసనం ఫైర్ అయింది. అతను 48 గంటలు కస్టడీలో ఉంటే ఉద్యోగం పోతుందని వ్యాఖ్యానించింది. ప్రతి అధికారికి హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత ఉందని తెలుసుకోవాలని స్పష్టం చేసింది. తాతా మోహనరావుకి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని న్యాయవాది కోర్ట్ దృష్టికి తెచ్చినప్పుడు.. న్యాయమూర్తి గవాయ్ జోక్యం చేసుకొని అతను ఎన్నో కుటుంబాలను ఖాళీ చేయించాడు, వారి పిల్లలు ఎమవుతారు? అని మండిపడ్డారు. సాధారణ పరిస్థితుల్లో పిటిషన్ తీసుకోవడం సరికాదు, అయినా మేము కొంత సహనాన్ని పాటిస్తూ నోటీసు జారీ చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!