Prudhvi Raj: ఆమె వల్లే ఈరోజు బతికి ఉన్నాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నటుడు పృథ్వీరాజ్.. మొదట్లో మంచి రోజులు చూశారు కానీ, ఆ తర్వాత అనూహ్యంగా ఎన్నో సమస్యల్లో చిక్కుకున్నారు. ఒకానొక సమయంలో.. అటు రాజకీయంగానూ, ఇటు సినిమాల పరంగానూ దాదాపు ఆయన కెరీర్ ముగిసిపోయిందన్న దుస్థితికి చేరుకున్నారు. అయితే.. తన తప్పుల్ని తెలుసుకున్న తర్వాత క్షమాపణలు చెప్పిన ఈయన ఇప్పుడు తిరిగి పుంజుకున్నారు. మళ్లీ లైమ్లైట్లోకి వచ్చిన పృథ్వీరాజ్.. ఓవైపు అవకాశాలు అందిపుచ్చుకుంటూ, మరోవైపు తప్పుల్ని సరిదిద్దుకుంటున్నారు. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. తన బ్యాడ్ ఫేజ్కి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని పంచుకుంటున్నారు.
తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన పృథ్వీ.. తాను ఈరోజు బతికి ఉండటానికి ఓ మహిళ కారణమని చెప్పుకొచ్చారు. 20 ఏళ్లుగా ఆమె తన బిడ్డలతో సమానంగా తనను ఆదరిస్తున్నారని, ఆర్థికంగానూ ఆదుకున్నారని చెప్పారు. కరోనా సమయంలో ఆమె తన దగ్గరే ఉన్నారని, అప్పుడు ఎన్నో పుకార్లు కూడా వచ్చాయన్నారు. వాటికి 2023లో సమాధానం చెప్తానని తెలిపారు. మొదట ఆ మహిళ పేరు వెల్లడించిన నిరాకరించిన పృథ్వీ.. ఆ తర్వాత ఆమె పేరును దాసరి పద్మరేఖగా వెల్లడించారు. తాను చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఆమె తెలుసని, డ్యాన్సర్గా పని చేశారని అన్నారు. ఆ తర్వాత ఆమె హైదరాబాద్ వచ్చేశారన్నారు. తనకు వాళ్ల తాత కూడా తెలుసని, ఏ సమస్య వచ్చినా వాటిని సమిష్టిగా పరిష్కరించుకుంటామని, ప్రస్తుతం ఆవిడే తన బాగోగులు చూసుకుంటున్నారని పృథ్వీ వివరించారు.
Also Read
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
తాను వైసీపీలో ఉన్న సమయంలో ఎవరెస్ట్ ఎక్కిన హిల్లరీ కంటే గొప్పవాడిననే ఫీలింగ్ తనకు కలిగిందని.. అప్పుడు తన స్థాయిని మర్చిపోయి ఎంతోమందిని ఎన్నో మాటలు అన్నానని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా.. వాళ్లందరూ తనను అర్థం చేసుకున్నారని, లేకపోతే ఇండస్ట్రీ నుంచి పృథ్వీ కనుమరుగై మూడేళ్లు అయ్యుండేదని పేర్కొన్నారు. 2020 నుంచి తనకు కష్టాలు ప్రారంభమయ్యాయని, తనను పలకరించిన వాళ్లూ దూరమయ్యారని పృథ్వీ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!